దివ్య ఖుర్ఆన్
మానవాళికి మార్గదర్శకత్వం వహించడానికి మరియు వారిని అంధకారాల నుండి వెలుగు వైపుకు నడిపించడానికి అల్లాహ్ తన సృష్టిలోనే అత్యుత్తమమైన వారు, ప్రవక్తల పరంపరలో చివరి వారైన దైవప్రవక్త ముహమ్మద్(స) వారిపై ఖుర్ఆన్ను అవతరింపజేశాడు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: "నిశ్చయంగా మీ వద్దకు అల్లాహ్ తరపు నుండి ఒక జ్యోతి (నూర్) మరియు స్పష్టమైన గ్రంథం వచ్చాయి. దీని ద్వారా అల్లాహ్ తన ప్రసన్నతను కోరిన వారికి శాంతి మార్గాలను చూపుతాడు. తన ఆజ్ఞతో వారిని అంధకారాల నుండి వెలుగు వైపునకు తీసుకువస్తాడు మరియు వారికి సరైన మార్గం (సిరాతె ముస్తఖీమ్) వైపు మార్గదర్శకత్వం చేస్తాడు." [అల్ మాయిదా: 15, 16]