నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ప్రవక్తల పై విశ్వాసం

ప్రవక్తల పై విశ్వాసం కలిగిఉండడం అనేది విశ్వాసపు ఆరు మూల స్థంబాలలో ఒకటి, ఈ పాఠములో ప్రవక్తల పై విశ్వాసం యొక్క అర్ధం, దాని ప్రాముఖ్యత, ప్రవక్తల గుణగణాలు మరియు వారు చేసిన అద్భుతాల గురించి తెలుసుకుంటారు.

  • ప్రవక్తల పై విశ్వాసం అంటే ఏమిటి, దాని యొక్క అవగాహన
  • ప్రవక్తల గుణగనాలకు సంబందించిన అవగాహన
  • వారు చేసిన కొన్ని అద్భుతాల గురించిన అవగాహన
  • వారిపై విశ్వాసము వలన కలిగే ప్రయోజనాల గురించిన అవగాహన

ప్రవక్తల పట్ల విశ్వాసం యొక్క అర్ధం

ప్రతి ఒక్క జాతి నుండి అల్లాహ్ తన ప్రవక్తను ఎన్నుకొని పంపాడని, అల్లాహ్ యొక్క ప్రవక్తలు జనులను కేవలం ఏకైక అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకు ఆహ్వానించారని ధృఢంగా విశ్వసించడం. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." (అల్ నహల్ - 36)

దైవప్రవక్తలందరూ సత్యవంతులు, నిజాయితీపరులు, సజ్జనులు, నమ్మదగినవారు, అల్లాహ్ కు భయపడేవారు, మరియు మార్గదర్శకులు అని విశ్వసిస్తున్నాము. వారికి అల్లాహ్ ఏమి ఆదేశించాడో దానిని వారు పూర్తిగా ప్రజలకు తెలియజేశారు. వారు ఏమీ దాచలేదు, ఏమీ మార్చలేదు, వారు సొంతంగా ఒక్క అక్షరాన్ని కూడా జోడించలేదు లేదా తొలగించలేదు. “వారికి, ఎవరైతే అల్లాహ్ సందేశాలను అందజేస్తారో మరియు కేవలం ఆయనకే భయపడతారో మరియు అల్లాహ్ కు తప్ప మరెవ్వరికీ భయపడరో! మరియు లెక్క తీసుకోవటానికి కేవలం అల్లాహ్ యే చాలు!” (అల్-అహ్జాబ్: 39).

ప్రజలకు సందేశం యొక్క అవసరం

ఖచ్చితంగా, మానవులకు దైవిక సందేశం అనేది అవసరం. అది ధర్మాధర్మాలను స్పష్టం చేసి, వారిని సరైన దారిలో నడిపిస్తుంది. దైవ సందేశం అనేది ప్రపంచానికి ఒక ఆత్మ, ఒక కాంతి మరియు ఒక జీవం వంటిది. తన ఆత్మను, జీవనాన్ని మరియు కాంతిని కోల్పోతే ఈ ప్రపంచం అర్ధరహితంగా, చీకటిమయంగా మారిపోతుంది. దానికి మంచి జరిగే ఆస్కారం లేకుండా పోతుంది.

అల్లాహ్ తన సందేశాన్ని రూహ్ (ఆత్మ) గా అభివర్ణించాడు. ఎందుకంటే ఆత్మ లేకుండా జీవితం అనేది ఉండదు. దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “మరియు ఇదే విధంగా (ఓ ముహమ్మద్!) మేము మా ఆజ్ఞతో నీ వద్దకు దివ్యజ్ఞానం (రూహ్) అవతరింపజేశాము. (దీనికి ముందు) నీకు గ్రంథమేమిటో మరియు విశ్వాసమేమిటో తెలియదు. కాని మేము దీనిని (ఈ ఖుర్ఆన్ ను) జ్యోతిగా జేసి, దీని ద్వారా మా దాసులలో మేము కోరిన వారికి, మార్గదర్శకత్వం చేస్తాము. మరియు నిశ్చయంగా, నీవు (ప్రజలకు) ఋజుమార్గం వైపునకు దారి చూపుతున్నావు”. (అల్-షురా: 52). అదేవిధంగా, సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సందేశం లేకుండా మానవ జీవితానికి నిజమైన అర్థం లేదు. మానవ మనస్సు అనేది మంచి మరియు చెడులను గుర్తించగలదు, కానీ వాటి యొక్క ఖచ్చితమైన వివరాలను తెలుసుకోవడం దానికి సంభవం కాదు. అల్లాహ్ యొక్క సందేశం ద్వారా మనం ఏది మంచి, ఏది చెడు అని ఖచ్చితంగా తెలుసుకోగలము.

ఇహపరలోకాలలో సంతోషం మరియు శ్రేయస్సు పొందడానికి ఏకైక మార్గం ప్రవక్తలు మాత్రమే. మంచి చెడులను ఖచ్చితంగా తెలుసుకోవడానికి వారి మార్గం తప్ప మరొక మార్గం లేదు. ఎవరైతే ప్రవక్తల సందేశాన్ని విస్మరిస్తారో, వ్యతిరేకిస్తారో, దాని నుండి దూరమవుతారో అటువంటి వారు జీవితంలో అలజడి, అశాంతి మరియు దుఃఖాన్ని పొందుతారు. “మేము (అల్లాహ్) ఇలా అన్నాము: "మీరంతా ఇక్కడి నుండి దిగిపోండి." ఇక నా తరఫు నుండి మీకు మార్గదర్శకత్వం తప్పక వస్తూ ఉంటుంది. అప్పుడు ఎవరైతే నా మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తారో వారికి ఎలాంటి భయమూ ఉండదు మరియు వారు దుఃఖపడరు కూడా! కానీ, ఎవరైతే (మార్గదర్శకత్వాన్ని) తిరస్కరిస్తారో మరియు మా సూచన(ఆయత్)లను అసత్యాలని తిరస్కరిస్తారో, అలాంటి వారు నరకాగ్ని వాసులవుతారు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు”. (అల్-బఖరా: 38, 39).

విశ్వాసపు మూల స్థంబాలలో ఒకటి ;

దైవప్రవక్తలను విశ్వసించడం అనేది విశ్వాసం యొక్క ఆరు మూల స్థంబాలలో ఒకటి. “ఈ ప్రవక్త తన ప్రభువు తరఫు నుండి, తనపై అవతరింపజేయబడిన దానిని విశ్వసించాడు మరియు (అదే విధంగా) విశ్వాసులు కూడా (విశ్వసించారు). వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. వారంటారు: "మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము”. (అల్-బఖరా: 285). ఈ ఆయత్ ద్వారా మనం ప్రవక్తలను విశ్వసించడం ఎంత కీలకమైనదో అర్ధం చేసుకోవచ్చును. ఒక ప్రవక్తను విశ్వసించి, మరొక ప్రవక్తను తిరస్కరించడం నిషిద్దం. యూదులు కేవలం ప్రవక్త మూసా(అ) వారిని మాత్రమే నమ్ముతారు, క్రైస్తవులు ప్రవక్త యేసు(ఈసా) (అ) వారిని మాత్రమే నమ్ముతారు. ఈ విధానం తప్పు. ఇది అవిశ్వాసం అనబడుతుంది. ఎందుకంటే ప్రవక్తలందరూ ఒకే దైవం నుండి వచ్చిన సందేశాన్ని మాత్రమే ప్రజలకు తెలియజేశారు.

విశ్వాసం గురించి దైవప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : నువు అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన పవిత్ర గ్రంధాలను, ఆయన ప్రవక్తలను, అంతిమదినాన్ని మరియు విధి యొక్క మంచి చెడులను విశ్వసించాలి.

ప్రవక్తల సూచనలు మరియు వారు చేసిన మహత్యాలు, అద్భుతాలు

అల్లాహ్ తన ప్రవక్తల యొక్క సత్యతను, వారి ప్రవక్తత్వం యొక్క నిరూపణకు వారిని వివిధ రకాల ఆధారాలు మరియు సూచనలతో బలపరిచాడు. వాటిలో ఒకటి మానవులు సాధించలేని అద్భుతాలు మరియు స్పష్టమైన సూచనల ద్వారా వారికి మద్దతు ఇవ్వడం. ఈ అద్భుతాల ద్వారా వారి నిజాయితీని నిర్ధారించడం మరియు వారి ప్రవక్తత్వాన్ని నిరూపించడం జరుగుతుంది. అద్భుతాలు అంటే మానవ సామర్థ్యాలకు మించిన, అల్లాహ్ తన ప్రవక్తల ద్వారా చూపించే అసాధారణమైన విషయాలు.

ప్రవక్తలు చేసిన అద్భుతాలు

١
మూసా (అ) వారి కర్ర పాముగా మారిపోవడము
٢
ఏసు వారు తన ప్రజలకు వారు ఏమి తింటున్నారో మరియు తమ ఇళ్ళలో ఏమి నిల్వ ఉంచుకుంటున్నారో దాని గురించి తెలియజేయడం.
٣
మన ప్రవక్త (స) వారు నుండు చంద్రుడిని రెండు మొక్కలుగా చీల్చడం

ప్రవక్తలపై విశ్వాసంలో ఏ విషయాలు ఉన్నాయి ?

1. ప్రవక్తలు అల్లాహ్ ద్వారా పంపబడ్డ సత్యమైన ప్రవక్తలు అనే విశ్వాసం కలిగి ఉండడం, వారందరూ కూడా ఒకే సందేశాన్నిచ్చారు, అదేమంటే : కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి మరియు ఆయనతో ఎవరినీ సహవర్తులుగానీ, భాగస్వాములుగానీ చేర్చకండి.

తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మరియు వాస్తవానికి, మేము ప్రతి సమాజం వారి వద్దకు ఒక ప్రవక్తను పంపాము. (అతనన్నాడు): "మీరు అల్లాహ్ ను మాత్రమే ఆరాధించండి. మరియు మిథ్యాదైవాల (తాగూత్ ల) ఆరాధనను త్యజించండి." (అన్-నహ్ల్: 36). ‬

గతములో వచ్చిన ప్రవక్త ల ఉమ్మతులకు వారి పరిస్థితులను బట్టి హలాల్ హరామ్ విషయాలలో కొన్ని వ్యత్యాసాలు ఉండేవి : తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : మీలో ప్రతి ఒక్క ఉమ్మతుకు ఒక ధర్మశాసనాన్ని మరియు జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము (అల్-మాయిదా: 48)

ప్రవక్తలందరి పట్ల విశ్వాసం కలిగి ఉండడం

మనం అల్లాహ్ పేర్కొన్న ప్రవక్తలందరినీ విశ్వసించడం తప్పనిసరి. వారిలో ముహమ్మద్(స), ఇబ్రహీం(అ), మూసా(అ), ఈసా(ఏసు) (అ), నూహ్(అ), యాఖూబ్(అ), యూసుఫ్(అ), యూనుస్(అ) మరియు ఇతరులు ఉన్నారు. మనకు తెలియని ప్రవక్తలపై కూడా మనం సాధారణంగా విశ్వాసం ఉంచాలి. ఏ ఒక్క ప్రవక్త యొక్క సందేశాన్ని తిరస్కరించినా అందరి సందేశాలను తిరస్కరించినట్లే.

నిరూపింపబడిన వారి గురించిన విషయాలను మరియు వారి చేసిన అద్భుతాలను విశ్వసించడం.

ఖురాను మరియు హదీసు ద్వారా వారి ఏ విషయాలైతే నిరూపించబడి ఉన్నాయో వాటన్నిటినీ యదార్ధమాని విశ్వసించడం. ఉదాహరణకు : మూసా (స)వారు తన చేతికర్రతో సముద్రాన్ని చీల్చడం.

4. చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ (స) వారు మనకోసం ఏదైతే ధర్మచట్టాన్ని తీసుకుని వచ్చారో దానిపై అమలు చేయడం.

ప్రవక్తల గుణగణాలలో :

1. వారు కూడా మనుషులే

వారికి మరియు ఇతరులకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే, వారిని అల్లాహ్ ద్యోతకం మరియు సందేశం కోసం ప్రత్యేకించి ఎంచుకున్నాడు. “మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము”. (అల్-అన్బియా:7). మరో చోట అల్లాహ్ ఇలా ప్రవచించాడు : “(ఓ ప్రవక్తా!) ఇంకా ఇలా అను: "నిశ్చయంగా, నేను కూడా మీలాంటి ఒక మానవుడనే! నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింపజేయబడింది. నిశ్చయంగా, మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం (అల్లాహ్) మాత్రమే!” (అల్- కహఫ్: 110). ప్రవక్తలకు దైవానికి సంబందించిన ఎటువంటి దైవ లక్షణాలు ఉండవు, కానీ వారు పుట్టుక పరంగా శారీరకంగా పరిపూర్ణంగా ఉన్నారు, నైతికతలో అత్యున్నత స్థాయిలో ఉన్నారు. అంతేకాకుండా, వారు ఉత్తమ వంశానికి చెందినవారు అయి ఉన్నారు, సరైన ఆలోచనా విధానం మరియు స్పష్టమైన భాషను కలిగి ఉన్నారు. ఈ లక్షణాలన్నీ వారికి ప్రవక్తత్వ బాధ్యతలను ఒర్చే మరియు నిర్వహించే అర్హతను కలిగించాయి. అల్లాహ్ ప్రవక్తలను మానవుల నుండి ఎంచుకున్నాడు, తద్వారా వారు తమ అనుచర సమాజానికి ఆదర్శంగా ఉండగలరు. ఫలితంగా, ప్రవక్తను అనుసరించడం మరియు అతనిని ఆదర్శంగా భావించడం మానవులకు సాధ్యమవుతుంది మరియు వారి సామర్థ్యాల పరిధిలోనే ఉంటుంది.

2.తన సందేశం కోసం అల్లాహ్ వారిని ఎంచుకున్నాడు

అల్లాహ్ మానవులలో కొందరిని మాత్రమే ప్రవక్తలుగా ఎంచుకున్నాడు, “అల్లాహ్ దేవదూతల నుండి మానవుల నుండి తన సందేశహరులను ఎన్నుకుంటాడు. నిశ్చయంగా, అల్లాహ్ సర్వం వినేవాడు, అంతా చూసేవాడు. (అల్-హజ్”: 75). ప్రవక్తత్వం మరియు రిసాలత్ ఒకరి వ్యక్తిత్వ స్వచ్ఛత, తెలివితేటలు లేదా తార్కిక శక్తి వల్ల లభించేవి కావు. అవి పూర్తిగా అల్లాహ్ యొక్క ఎంపిక మరియు అతని విధికి సంబందించినది. సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ తనకు నచ్చిన వారిని మానవులలోంచి ఎంచుకుని ప్రవక్తలుగా నియమించాడు. ఈ ఎంపికకు కారణం ఏమిటో మనకు తెలియదు. అది అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు శక్తికి సంబంధించిన అంశం. అయితే, ఒక విషయం మాత్రం ఖచ్చితం: ప్రవక్తలు అల్లాహ్ యొక్క ఎంపికైన వ్యక్తులు, మరియు వారు మానవాళికి మార్గదర్శకులుగా పంపబడ్డారు. “తన సందేశాన్ని ఎవరిపై అవతరింపజేయాలో అల్లాహ్ కు బాగా తెలుసు. (అల్-అనామ్”: 124).

వారు అల్లాహ్ తరపున ఏదైతే సందేశాన్ని అందిస్తున్నారో వారు అందులో సత్యవంతులు

అల్లాహ్ తరుపున సందేశాన్ని అందించడంలో వారు ఎటువంటి తప్పు చేయరు మరియు అల్లాహ్ వారిపై అవతరింపజేసే దైవవాణిని చెప్పడంలో కూడా ఎటువంటి తప్పు చేయరు.

4. సత్యం

ప్రవక్తలందరూ తమ మాటలలో మరియు ఆచరణాలలో సత్యవంతులు. తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "ఇదే ఆ కరుణామయుడు చేసిన వాగ్దానం. మరియు అతని సందేశహరులు సత్యమే పలికారు!" (యాసిన్: 52)

5. సహనం

వాస్తవానికి, వారు సర్వసృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క మార్గం వైపు పిలుపునిచ్చారు, శుభవార్తలను తెలియజేస్తూ మరియు హెచ్చరిస్తూ. దీని కారణంగా వారికి అనేక రకాల నష్టాలు మరియు కష్టాలు ఎదురయ్యాయి. కానీ అల్లాహ్ యొక్క సందేశాన్ని జనులలో వ్యాప్తి చేయడం కోసం వారు ఈ కష్టానష్టాలను ఓపికగా భరించారు. “కావున నీవు (ఓ ప్రవక్తా!) సహనం వహించు! దృఢ సంకల్పం గల ప్రవక్తలు సహనం వహించినట్లు”. (అల్-అహ్కాఫ్: 35).

ప్రవక్తల పట్ల విశ్వాసం కలిగి ఉండడంలో గొప్ప ప్రతిఫలాలు ఉన్నాయి

١
జ్ఞానాన్ని అందించడం ద్వారా మానవులను సన్మార్గంలో నడిపించడానికి ఏర్పాట్లు చేయడం అనేది అల్లాహ్ యొక్క గొప్ప కృప మరియు అనుగ్రహం. ఈ కారణంగానే అల్లాహ్ తన ప్రవక్తలను పంపాడు. తమ సృష్టికర్తను ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ఆరాధించాలి, అతను చూపించిన సన్మార్గం పై ఎలా నడవాలి అనే విషయాలను ఈ ప్రవక్తల ద్వారా అల్లాహ్ మానవాళికి తెలియజేశాడు. “మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. (అల్ - అన్ బియా: 107).
٢
ఈ గొప్ప అనుగ్రహం పట్ల అల్లాహ్ కు కృతజ్ఞులై ఉండాలి
٣
ప్రవక్తల పట్ల ప్రేమ మరియు గౌరవ మర్యాదలు కలిగి ఉండడం, వారి స్థాయిని తగ్గట్టుగా వారిని ప్రశంసించడం ఉండాలి, ఎందుకంటే వారు అల్లాహ్ యొక్క ఆరాధన, అతని సందేశాన్ని అతని దాసులకు అందించే బృహత్కార బాధ్యతలను తమ భుజస్కందాలపై ఎత్తుకున్నారు. .
٤
కేవలం అల్లాహ్ ను మాత్రమే ఆరాధించాలి, ఆయనకు ఎవరూ సాటి లేరు అనే ఈ సందేశాన్ని ప్రవక్తలందరూ అల్లాహ్ తరపున తీసుకువచ్చారు, మనము ఆ సందేశాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ఈ దైవసందేశం ద్వారా విశ్వాసుల జీవితాలలో ఇహపరలోకాలలో సన్మార్గము మరియు నిజమైన ఆనందాలు ప్రాప్తమవుతాయి. .

తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "కావున నా మార్గదర్శకత్వాన్ని అనుసరించే వాడు, మార్గభ్రష్టుడూ కాడు మరియు దురవస్థకు గురికాడు. మరియు ఎవడైతే నా సందేశం నుండి విముఖుడవుతాడో నిశ్చయంగా, అతని జీవితం ఇరుకై పోతుంది" (తహా: 123-124).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి