ప్రస్తుత విభాగం : model
పాఠం మృతదేహానికి గుస్ల్(స్నానం) చేయించడం మరియు కఫన్ (వస్త్రం) తొడిగించడం.
ఒక ముస్లిము మరణించినప్పుడు చేయవలసిన అభిలషణీయమైన పనులు.
మరణం సంభవించి, ప్రాణం శరీరాన్ని వదిలినట్లు నిర్ధారణ అయిన తర్వాత కొన్ని పనులను చేయడం అభిలషణీయం.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అబూ సలమా(ర) వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారి కళ్ళు తెరచి ఉన్నాయి. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆ కళ్ళను మూసి ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా మరణించినప్పుడు, వారి కళ్ళను మూయండి" (ఇబ్న్ మాజ 1455).
2. సహనం వహించడం మరియు నిగ్రహాన్ని కలిగి ఉండటం.
బిగ్గరగా ఏడవకుండా మరియు విలపించకుండా నిగ్రహం కలిగి ఉండాలి. మరణించిన వారి కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి కుమార్తె వారి బిడ్డ మరణించినప్పుడు, వారు ఆమెను సహనం వహించి పుణ్యాన్ని ఆశించమని సెలవిచ్చారు (బుఖారీ 1284, ముస్లిం 923).
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఒక గౌరవనీయ సహాబీ (అనుచరుడు) అయిన అబూ సలమా(ర) వారు మరణించినప్పుడు ఇలాగే చేశారు: "నిశ్చయంగా ప్రాణం శరీరం నుండి తీయబడినప్పుడు, కళ్ళు దానిని అనుసరిస్తాయి" అని సెలవిచ్చి, ఆపై ఇలా దుఆ చేశారు: "ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, సన్మార్గం పొందిన వారిలో వారి స్థాయిని పెంచు, వారి తర్వాత మిగిలి ఉన్న వారి కుటుంబానికి నీవే సంరక్షకుడిగా ఉండు. ఓ సర్వలోకాల ప్రభువా! మాకు మరియు వారికి పాపక్షమాపణ ప్రసాదించు, వారి సమాధిని విశాలం చేయి మరియు దానిని కాంతితో నింపు" (ముస్లిము 920).
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "జనాజాను (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకువెళ్ళండి. ఒకవేళ వారు పుణ్యాత్ములైతే, మీరు వారిని మేలు వైపునకు త్వరగా చేర్చిన వారవుతారు. ఒకవేళ వారు అలా కాకుండా ఉంటే, మీ భుజాల మీద ఉన్న ఒక చెడును మీరు త్వరగా దించేసిన వారవుతారు." (బుఖారీ 1315, ముస్లిం 944).
5. చనిపోయిన వారి కుటుంబానికి సహకారం అందించడం
మరియు వారి బాధ్యతలలో కొన్నింటిని నెరవేరుస్తూ వారికి సహాయపడాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి పినతండ్రి కుమారుడైన జాఫర్ బిన్ అబీ తాలిబ్(ర) వారు షహీద్ అయినప్పుడు, వారి కుటుంబ సభ్యుల కొరకు ఆహారాన్ని తయారు చేయమని దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చారు: "జాఫర్ కుటుంబం కొరకు ఆహారాన్ని సిద్ధం చేయండి, ఎందుకంటే వారిని కలతపెట్టే (దుఖకరమైన) విషయం ఒకటి వారి పట్ల జరిగింది." (అబూ దావూద్ 3132, తిర్మిదీ 998 దీనిని సహీహ్ అని ధృవీకరించారు, ఇబ్న్ మాజా 1610).
మరణించిన వారిని కఫన్ మరియు అంత్యక్రియలకు ముందు స్నానం (గుస్ల్) చేయించడం తప్పనిసరి. ఈ స్నానాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఇతర ముస్లిములు చేయించవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు పవిత్రులు మరియు పరిశుద్ధులైనప్పటికీ, వారు మరణించినప్పుడు వారికి కూడా స్నానం చేయించడం జరిగింది.
మరణించిన వారి శరీరమంతటా నీరు పారేలా చేయడం మరియు శరీరంపై ఏవైనా అపవిత్రతలు ఉంటే వాటిని తొలగించడం ద్వారా వారికి చేయించే స్నానం (శుద్ధత) పూర్తవుతుంది. అయితే స్నానం చేయించే సమయంలో వారి మర్మస్థానాలను (సతర్) కప్పి ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ క్రింది విషయాలను పాటించడం ఉత్తమం (ముస్తహబ్):
1. బట్టలు విప్పిన తర్వాత, వారి నాభి నుండి మోకాళ్ల వరకు ఉన్న మర్మస్థానాన్ని (సతర్) కప్పి ఉంచాలి.
2. స్నానం చేయించే వ్యక్తి, మరణించిన వారి మర్మస్థానాన్ని (సతర్) శుభ్రపరిచేటప్పుడు చేతికి తొడుగులు (గ్లౌవ్స్) లేదా ఒక గుడ్డను ధరించాలి.
3. మరణించిన వారి శరీరంపై ఉన్న మాలిన్యాలను మరియు అపవిత్రతలను తొలగించడంతో ప్రారంభించాలి.
4. ఆ తర్వాత నమాజుకు చేసే వదు మాదిరిగానే వదులోని అవయవాలను నిర్ణీత క్రమంలో శుభ్రపరచాలి.(వుదూ చేయించాలి).
5. తర్వాత తల మరియు శరీరంలోని మిగిలిన భాగాలను కడగాలి. ఇది సిద్ర్ (రేగు ఆకులు) లేదా సబ్బుతో కడగడం మంచిది, తర్వాత శరీరంపై నీరు పోయాలి.
6. శరీరంలోని కుడి భాగాన్ని మొదట, ఆ తర్వాత ఎడమ భాగాన్ని కడగడం ఉత్తమం.
7. అవసరమైతే స్నాన(గుస్ల్) ప్రక్రియను మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయించడం ఉత్తమం.
దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ కుమార్తె జైనబ్(ర) వారికి స్నానం (గుస్ల్) చేయిస్తున్న మహిళలతో ఇలా సెలవిచ్చారు: "ఆమెకు మూడు సార్లు, ఐదు సార్లు లేదా అవసరమని మీరు భావిస్తే అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయించండి." (బుఖారీ 1253, ముస్లిం 939).
8. మాలిన్యాలు లేదా రక్తం బయటకు రాకుండా ఉండటానికి బట్టలు, పత్తి వంటి వాటిని ఉపయోగించవచ్చు.
మల, మూత్ర విసర్జక ద్వారాలు, చెవులు, ముక్కు మరియు నోటి రంధ్రాలలో దూదిని ఉంచాలి; తద్వారా వాటి నుండి ఎటువంటి మాలిన్యం లేదా రక్తం బయటకు రాకుండా ఉంటుంది.
స్నానం (శుద్ధత) చేయించే సమయంలో మరియు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలను వాడవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ కుమార్తె జైనబ్(ర) వారికి స్నానం చేయిస్తున్న మహిళలను ఉద్దేశించి, చివరిసారి నీళ్లు పోసేటప్పుడు అందులో కర్పూరం (ఒక రకమైన సుగంధ ద్రవ్యం) కలపమని ఆదేశించారు. (బుఖారీ 1253, ముస్లిం 939).
స్నానం (గుస్ల్) ఎవరు చేయించాలి?
ఆయిషా(ర) వారు ఇలా అన్నారు: "ఏ విషయాలైతే నాకు తర్వాత తెలిశాయో, అవి ముందే తెలిసి ఉంటే, దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి వారి భార్యలలో ఎవరైనా తప్ప మరెవరూ స్నానం (గుస్ల్) చేయించేవారు కాదు." (అబూ దావుద్ 3141, ఇబ్నె మాజ 1464).
మరణించిన వారికి శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా కఫన్ (వస్త్రం) తొడిగించడం అనేది వారి కుటుంబ సభ్యులు మరియు ముస్లిములపై ఉన్న బాధ్యత. ఇది ఫర్దె కిఫాయ (సామూహిక బాధ్యత). ప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీ దుస్తులలో తెల్లని వాటిని ధరించుము; నిశ్చయంగా అవి మీ దుస్తులన్నిటిలో ఉత్తమమైనవి, మరియు మీలోని మరణించిన వారికి వాటితోనే కఫన్ (శవ వస్త్రం) తొడిగించుము" (అబూ దావుద్ 3878).
మరణించిన వారికి కఫన్ (వస్త్రం) ఖర్చులు ఆయన ఆస్తి నుండే భరించాలి. ఒకవేళ ఆయనకు ఎలాంటి ఆస్తి లేకపోతే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే ఆయన ఖర్చులను భరించాల్సి ఉంటుందో (తండ్రి, తాత, కుమారుడు లేదా మనవడు వంటి వారు), వారే ఈ కఫన్ ఖర్చులను కూడా భరించాలి. అది కూడా సాధ్యపడకపోతే, ముస్లిములలోని ధనవంతులైన వారు ఆ బాధ్యతను స్వీకరించాలి.
మరణించిన వారు పురుషులైనా లేదా మహిళలైనా సరే, వారి శరీరాన్ని పూర్తిగా కప్పేలా ఉండే శుద్ధత కలిగిన వస్త్రాలు కఫన్ (వస్త్రం) కోసం సరిపోతాయి.