నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం మృతదేహానికి గుస్ల్(స్నానం) చేయించడం మరియు కఫన్ (వస్త్రం) తొడిగించడం.

ఇస్లామీయ నియమావళి (షరీఅత్) ముస్లిములను (విశ్వాసులను) వారి జీవితకాలంలో గౌరవించినట్లే, మరణానంతరం కూడా గౌరవించింది. మృతదేహానికి గుస్ల్ (స్నానం) చేయించడం మరియు కఫన్ (వస్త్రం) ధరింపజేయడానికి సంబంధించిన కొన్ని నియమాలను మీరు ఈ పాఠంలో నేర్చుకుంటారు.

  • ఒక ముస్లిముకు అతని  మరణానంతరం చేయవలసిన ఉత్తమ కార్యాల గురించి తెలుసుకోవడం. 
  • మృతదేహానికి స్నానం (గుస్ల్) చేకూర్చే విధానాన్ని తెలుసుకోవడం. 
  • కఫన్ (శవ వస్త్రం) కు సంబంధించిన కొన్ని నియమాలను తెలుసుకోవడం.

ఒక ముస్లిము మరణించినప్పుడు చేయవలసిన అభిలషణీయమైన పనులు.

మరణం సంభవించి, ప్రాణం శరీరాన్ని వదిలినట్లు నిర్ధారణ అయిన తర్వాత కొన్ని పనులను చేయడం అభిలషణీయం.

1. మరణించిన వ్యక్తి పట్ల గౌరవార్థం వారి కళ్ళను మెల్లగా మూయాలి.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అబూ సలమా(ర) వారి వద్దకు వెళ్ళినప్పుడు, వారి కళ్ళు తెరచి ఉన్నాయి. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆ కళ్ళను మూసి ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా మరణించినప్పుడు, వారి కళ్ళను మూయండి" (ఇబ్న్ మాజ 1455).

2. సహనం వహించడం మరియు నిగ్రహాన్ని కలిగి ఉండటం.

బిగ్గరగా ఏడవకుండా మరియు విలపించకుండా నిగ్రహం కలిగి ఉండాలి. మరణించిన వారి కుటుంబ సభ్యులను, బంధువులను ఓదార్చాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి కుమార్తె వారి బిడ్డ మరణించినప్పుడు, వారు ఆమెను సహనం వహించి పుణ్యాన్ని ఆశించమని సెలవిచ్చారు (బుఖారీ 1284, ముస్లిం 923).

3. మరణించిన వారికి కారుణ్యం మరియు పాపక్షమాపణ లభించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు సహనం మరియు ఓదార్పు కలగాలని వేడుకోవడం.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఒక గౌరవనీయ సహాబీ (అనుచరుడు) అయిన అబూ సలమా(ర) వారు మరణించినప్పుడు ఇలాగే చేశారు: "నిశ్చయంగా ప్రాణం శరీరం నుండి తీయబడినప్పుడు, కళ్ళు దానిని అనుసరిస్తాయి" అని సెలవిచ్చి, ఆపై ఇలా దుఆ చేశారు: "ఓ అల్లాహ్! అబూ సలమాను క్షమించు, సన్మార్గం పొందిన వారిలో వారి స్థాయిని పెంచు, వారి తర్వాత మిగిలి ఉన్న వారి కుటుంబానికి నీవే సంరక్షకుడిగా ఉండు. ఓ సర్వలోకాల ప్రభువా! మాకు మరియు వారికి పాపక్షమాపణ ప్రసాదించు, వారి సమాధిని విశాలం చేయి మరియు దానిని కాంతితో నింపు" (ముస్లిము 920).

4. మృతుడిని సిద్ధం చేయడం, అంత్యక్రియల స్నానం చేయించడం, అతని కోసం దుఆ చేయడం మరియు ఖననం చేయడంలో త్వరపడటం.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "జనాజాను (అంత్యక్రియల కొరకు) త్వరగా తీసుకువెళ్ళండి. ఒకవేళ వారు పుణ్యాత్ములైతే, మీరు వారిని మేలు వైపునకు త్వరగా చేర్చిన వారవుతారు. ఒకవేళ వారు అలా కాకుండా ఉంటే, మీ భుజాల మీద ఉన్న ఒక చెడును మీరు త్వరగా దించేసిన వారవుతారు." (బుఖారీ 1315, ముస్లిం 944).

5. చనిపోయిన వారి కుటుంబానికి సహకారం అందించడం

మరియు వారి బాధ్యతలలో కొన్నింటిని నెరవేరుస్తూ వారికి సహాయపడాలి. దైవప్రవక్త ముహమ్మద్(స) వారి పినతండ్రి కుమారుడైన జాఫర్ బిన్ అబీ తాలిబ్(ర) వారు షహీద్ అయినప్పుడు, వారి కుటుంబ సభ్యుల కొరకు ఆహారాన్ని తయారు చేయమని దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చారు: "జాఫర్ కుటుంబం కొరకు ఆహారాన్ని సిద్ధం చేయండి, ఎందుకంటే వారిని కలతపెట్టే (దుఖకరమైన) విషయం ఒకటి వారి పట్ల జరిగింది." (అబూ దావూద్ 3132, తిర్మిదీ 998 దీనిని సహీహ్ అని ధృవీకరించారు, ఇబ్న్ మాజా 1610).

మృతదేహాన్ని స్నానం(గుస్ల్) చేయించడం

మరణించిన వారిని కఫన్ మరియు అంత్యక్రియలకు ముందు స్నానం (గుస్ల్) చేయించడం తప్పనిసరి. ఈ స్నానాన్ని వారి కుటుంబ సభ్యులు, బంధువులు లేదా ఇతర ముస్లిములు చేయించవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు పవిత్రులు మరియు పరిశుద్ధులైనప్పటికీ, వారు మరణించినప్పుడు వారికి కూడా స్నానం చేయించడం జరిగింది.

గుస్ల్ చేయించే విధానం

మరణించిన వారి శరీరమంతటా నీరు పారేలా చేయడం మరియు శరీరంపై ఏవైనా అపవిత్రతలు ఉంటే వాటిని తొలగించడం ద్వారా వారికి చేయించే స్నానం (శుద్ధత) పూర్తవుతుంది. అయితే స్నానం చేయించే సమయంలో వారి మర్మస్థానాలను (సతర్) కప్పి ఉంచడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ క్రింది విషయాలను పాటించడం ఉత్తమం (ముస్తహబ్):

1. బట్టలు విప్పిన తర్వాత, వారి నాభి నుండి మోకాళ్ల వరకు ఉన్న మర్మస్థానాన్ని (సతర్) కప్పి ఉంచాలి.

2. స్నానం చేయించే వ్యక్తి, మరణించిన వారి మర్మస్థానాన్ని (సతర్) శుభ్రపరిచేటప్పుడు చేతికి తొడుగులు (గ్లౌవ్స్) లేదా ఒక గుడ్డను ధరించాలి.

3. మరణించిన వారి శరీరంపై ఉన్న మాలిన్యాలను మరియు అపవిత్రతలను తొలగించడంతో ప్రారంభించాలి.

4. ఆ తర్వాత నమాజుకు చేసే వదు మాదిరిగానే వదులోని అవయవాలను నిర్ణీత క్రమంలో శుభ్రపరచాలి.(వుదూ చేయించాలి).

5. తర్వాత తల మరియు శరీరంలోని మిగిలిన భాగాలను కడగాలి. ఇది సిద్ర్ (రేగు ఆకులు) లేదా సబ్బుతో కడగడం మంచిది, తర్వాత శరీరంపై నీరు పోయాలి.

6. శరీరంలోని కుడి భాగాన్ని మొదట, ఆ తర్వాత ఎడమ భాగాన్ని కడగడం ఉత్తమం.

7. అవసరమైతే స్నాన(గుస్ల్) ప్రక్రియను మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు చేయించడం ఉత్తమం.

దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ కుమార్తె జైనబ్(ర) వారికి స్నానం (గుస్ల్) చేయిస్తున్న మహిళలతో ఇలా సెలవిచ్చారు: "ఆమెకు మూడు సార్లు, ఐదు సార్లు లేదా అవసరమని మీరు భావిస్తే అంతకంటే ఎక్కువ సార్లు స్నానం చేయించండి." (బుఖారీ 1253, ముస్లిం 939).

8. మాలిన్యాలు లేదా రక్తం బయటకు రాకుండా ఉండటానికి బట్టలు, పత్తి వంటి వాటిని ఉపయోగించవచ్చు.

మల, మూత్ర విసర్జక ద్వారాలు, చెవులు, ముక్కు మరియు నోటి రంధ్రాలలో దూదిని ఉంచాలి; తద్వారా వాటి నుండి ఎటువంటి మాలిన్యం లేదా రక్తం బయటకు రాకుండా ఉంటుంది.

9. మృతుడికి సుగంధ ద్రవ్యాలను పూయడం ఉత్తమం.

స్నానం (శుద్ధత) చేయించే సమయంలో మరియు ఆ తర్వాత సుగంధ ద్రవ్యాలను వాడవచ్చు. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ కుమార్తె జైనబ్(ర) వారికి స్నానం చేయిస్తున్న మహిళలను ఉద్దేశించి, చివరిసారి నీళ్లు పోసేటప్పుడు అందులో కర్పూరం (ఒక రకమైన సుగంధ ద్రవ్యం) కలపమని ఆదేశించారు. (బుఖారీ 1253, ముస్లిం 939).

స్నానం (గుస్ల్) ఎవరు చేయించాలి?

١
ఒకవేళ మృతుడు తనను ఫలానా వ్యక్తి స్నానం (గుస్ల్ ) చేయించాలని కోరుతూ తుది కోరిక (వసియ్యత్) వెల్లడించి ఉంటే, దానిని తప్పక అమలు చేయాలి.
٢
ఏడు సంవత్సరాల లోపు వయసున్న బాలురు మరియు బాలికలకు పురుషులు లేదా మహిళలు ఎవరైనా స్నానం (గుస్ల్) చేయించవచ్చు. అయితే, బాలుడికి పురుషులు మరియు బాలికకు మహిళలు స్నానం చేయించడం ఉత్తమం.
٣
మరణించిన వారి వయసు ఏడు సంవత్సరాల పైబడి ఉంటే, పురుషుడికి కేవలం పురుషులు మాత్రమే మరియు స్త్రీకి కేవలం స్త్రీలు మాత్రమే స్నానం (గుస్ల్) చేయించాలి.
٤
భర్త తన భార్యకు మరియు భార్య తన భర్తకు స్నానం (శుద్ధత) చేయించవచ్చు. అలీ బిన్ అబీ తాలిబ్(ర) వారు ఫాతిమా(ర) వారికి స్నానం చేయించారు.

ఆయిషా(ర) వారు ఇలా అన్నారు: "ఏ విషయాలైతే నాకు తర్వాత తెలిశాయో, అవి ముందే తెలిసి ఉంటే, దైవప్రవక్త ముహమ్మద్(స) వారికి వారి భార్యలలో ఎవరైనా తప్ప మరెవరూ స్నానం (గుస్ల్) చేయించేవారు కాదు." (అబూ దావుద్ 3141, ఇబ్నె మాజ 1464).

మరణించిన వారిని సమాధి చేయడానికి సిద్ధం చేయడం

మరణించిన వారికి శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా కఫన్ (వస్త్రం) తొడిగించడం అనేది వారి కుటుంబ సభ్యులు మరియు ముస్లిములపై ఉన్న బాధ్యత. ఇది ఫర్దె కిఫాయ (సామూహిక బాధ్యత). ప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "మీ దుస్తులలో తెల్లని వాటిని ధరించుము; నిశ్చయంగా అవి మీ దుస్తులన్నిటిలో ఉత్తమమైనవి, మరియు మీలోని మరణించిన వారికి వాటితోనే కఫన్ (శవ వస్త్రం) తొడిగించుము" (అబూ దావుద్ 3878).

మరణించిన వారికి కఫన్ (వస్త్రం) ఖర్చులు ఆయన ఆస్తి నుండే భరించాలి. ఒకవేళ ఆయనకు ఎలాంటి ఆస్తి లేకపోతే, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఎవరైతే ఆయన ఖర్చులను భరించాల్సి ఉంటుందో (తండ్రి, తాత, కుమారుడు లేదా మనవడు వంటి వారు), వారే ఈ కఫన్ ఖర్చులను కూడా భరించాలి. అది కూడా సాధ్యపడకపోతే, ముస్లిములలోని ధనవంతులైన వారు ఆ బాధ్యతను స్వీకరించాలి.

మరణించిన వారు పురుషులైనా లేదా మహిళలైనా సరే, వారి శరీరాన్ని పూర్తిగా కప్పేలా ఉండే శుద్ధత కలిగిన వస్త్రాలు కఫన్ (వస్త్రం) కోసం సరిపోతాయి.

కఫన్ (అంతిమ వస్త్రం) తొడిగించేటప్పుడు ఇవి ఉత్తమమైన పద్ధతులు (ముస్తహబ్):

١
పురుషుడికి దైవప్రవక్త (స) వారికి చేసినట్లే మూడు తెల్లని వస్త్రాలలో కఫన్ (అంతిమ వస్త్రం) తొడిగించడం ఉత్తమం. అలాగే మహిళకు మరింత గోప్యత కోసం ఐదు వస్త్రాలలో కఫన్ తొడిగించడం ఉత్తమం.
٢
అనుకూలమైతే కఫన్ (అంతిమ వస్త్రం) రంగు తెలుపులో ఉండటం ఉత్తమం. ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా సెలవిచ్చారు: "మీ దుస్తులలో తెల్లని వాటిని ధరించుము; నిశ్చయంగా అవి మీ దుస్తులన్నిటిలో ఉత్తమమైనవి, మరియు మీలోని మరణించిన వారికి వాటితోనే కఫన్ (అంతిమ వస్త్రం) తొడిగించుము" (అబూ దావుద్ 4061, తిర్మిదీ 994 దీనిని ఆయన సహీహ్ అని పేర్కొన్నారు, ఇబ్నె మాజ 3566).
٣
అనుమతించబడిన రక రకాల సుగంధ ద్రవ్యాలతో కఫన్ (అంతిమ వస్త్రం)కు సువాసన అద్దడం ఉత్తమం.
٤
మరణించిన వారి తల మరియు పాదాల వద్ద వస్త్రాలను చుట్టేటప్పుడు, కఫన్ (అంతిమ వస్త్రం)ను ఎంతో జాగ్రత్తగా మరియు పద్ధతిగా అమర్చాలి. ప్రవక్త ముహమ్మద్ (స) వారు ఇలా సెలవిచ్చారు: "మీలో ఎవరైనా తన సోదరుడికి కఫన్ (అంతిమ వస్త్రం) తొడిగించేటప్పుడు, దానిని చక్కగా (గౌరవప్రదంగా) చేయాలి." (ముస్లిం 943).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి