ప్రస్తుత విభాగం : model
పాఠం చనిపోయిన వారి పట్ల సంతాపం మరియు సానుభూతి తెలియజేయడం
ఓదార్పు
చనిపోయిన వారి కుటుంబానికి సంతాపం తెలియజేయడం మరియు వారి బంధువులను ఓదార్చడం, వారి కోసం దుఆ చేయడం సహనం మరియు ఓర్పుతో ఉండమని వారికి నచ్చజెప్పడం చేయాలి. అలాగే ఈ సహనం కారణంగా వారికి లభించే పుణ్యం గురించి తెలియపరచాలి. ఇటువంటివి వారికి మనోబలాన్ని, స్థిమితాన్ని అందిస్తాయి. దైవప్రవక్త ముహమ్మద్ (స) వారు తన కుమార్తె జైనబ్(ర)కు ఆమె(ర) కుమారుడి మరణం గురించి సంతాపం తెలియజేస్తూ ఇలా ప్రవచించారు: "అల్లాహ్ తీసుకున్నది అల్లాహ్కే చెందుతుంది, మరియు ఆయన ఇచ్చినది ఆయనకే చెందుతుంది, మరియు ప్రతిదానికి ఆయన వద్ద ఒక నిర్ణీత సమయం ఉంటుంది, కాబట్టి ఓపిక పట్టు మరియు ప్రతిఫలం ఆశించు" (బుఖారీ 1284, ముస్లిం 923).
ఖననం చేయడానికి ముందు మరియు తర్వాత, మస్జిదులో, స్మశానవాటికలో, ఇంట్లో, పనిలో లేదా మరెక్కడైనా, చనిపోయిన వారి బంధువులకు సంతాపం తెలియజేయవచ్చు.
సంతాప కార్యక్రమాలలో డేరాలు వేయడం, విందులు ఏర్పాటు చేయడం, ప్రజలు వాటి కోసం గుమిగూడడం వంటి వాటితో అతిశయోక్తి చేయకూడదు, ఎందుకంటే ఇది దైవప్రవక్త ముహమ్మద్(స) మరియు వారి(స) సహచరుల(సహాబాల) పద్ధతి కాదు, మరియు ఇది సంతోషం మరియు ఆనంద సందర్భం కూడా కాదు.
చనిపోయిన వారి కోసం దుఃఖం మరియు సంతాపం
ఏడవడం అనేది సహజమైన కరుణ మరియు ప్రియమైన వారిని కోల్పోయిన బాధను వ్యక్తం చేసే ఒక విధానం. ప్రవక్త ముహమ్మద్ (స) వారు కూడా తన కుమారుడు ఇబ్రాహీం మరణించినప్పుడు కన్నీరు కార్చారు (బుఖారి 1303, ముస్లిం 2315).
మరణించిన వారిపై దుఃఖం వ్యక్తం చేయడానికి ఇస్లామీయ నియమావళి కొన్ని పరిమితులను విధించింది:
భర్త మరణించిన మహిళ పాటించవలసిన ఇద్దత్ కాలపరిమితి
నాలుగు నెలల పది రోజులు. ఒకవేళ ఆమె గర్భవతి అయి ఉంటే, ప్రసవం అయ్యే వరకు ఆమె ఇద్దత్ కాలం ఉంటుంది.
భర్త మరణించినప్పుడు మహిళ తన ఇద్దా (గడువు) కాలంలో పాటించవలసిన నియమాలు ఏమిటి ?
సమాధులను సందర్శించడం అనేది మూడు రకాలుగా విభజించబడింది:
1. అభిలషణీయమైన సందర్శన
మరణాన్ని, సమాధిని మరియు పరలోక జీవితాన్ని గుర్తుంచుకోవడానికి సమాధులను సందర్శించడం దీని ముఖ్య ఉద్దేశం. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "నేను గతంలో మిమ్మల్ని సమాధులను సందర్శించవద్దని వారించాను, అయితే ఇప్పుడు మీరు వాటిని సందర్శించండి." మరో ఉల్లేఖనంలో: "నిశ్చయంగా ఇది (సందర్శన) పరలోకాన్ని గుర్తు చేస్తుంది" (ముస్లిం 977, తిర్మిది 1054). ఇది తాము నివసిస్తున్న ప్రాంతంలోని సమాధులను సందర్శించడానికి మాత్రమే పరిమితం; కేవలం వాటి సందర్శనార్థం పుణ్యం లభిస్తుందనే ఉద్దేశంతో ప్రత్యేకంగా సుదూర ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే ఇస్లామీయ నియమావళి ప్రకారం పుణ్యం ఆశించి ప్రయాణ సంకల్పం చేసి వెళ్లడానికి అనేది కేవలం మూడు మసీదులకు (మస్జిదుల్ హరామ్, మస్జిదే నబవీ మరియు మస్జిదే అఖ్సా) మాత్రమే అనుమతి ఉంది. కాబట్టి, పుణ్యం లభిస్తుందనే ఆశతో సమాధుల సందర్శనార్థం ప్రత్యేకంగా ప్రయాణాలు చేయడం ధర్మసమ్మతం కాదు.
2. అనుమతించబడిన సందర్శన
ఇది ఒక అనుమతించబడిన ఉద్దేశం కోసం చేసే సందర్శన. ఇది కేవలం మరణాన్ని గుర్తు చేసుకోవడానికి మాత్రమే కాదు మరియు ఇందులో ఎటువంటి నిషిద్ధమైన పనులు ఉండవు. ఉదాహరణకు, పరలోక జీవితాన్ని గుర్తుంచుకోవాలనే ఉద్దేశం లేకపోయినప్పటికీ, తన బంధువుల లేదా స్నేహితుడి సమాధిని సందర్శించడం దీని క్రిందికే వస్తుంది.
3. నిషిద్ధమైన (హరామ్) సందర్శన:
ఇది నిషిద్ధమైన పనులతో కూడుకున్న సందర్శన; ఉదాహరణకు సమాధిపై కూర్చోవడం, దానిపై నడవడం, చెంపలు వేసుకోవడం, రోదించడం మరియు గట్టిగా కేకలు వేస్తూ ఏడవడం వంటివి. అలాగే బిదఅత్ (ధర్మంలో లేని కొత్త విషయాలు) పనులైన సమాధిలో ఉన్నవారి ద్వారా అల్లాహ్ను వేడుకోవడం (వసీలా), సమాధిని తాకడం లేదా రుద్దడం ద్వారా శుభాలను (బర్కత్) కోరుకోవడం వంటివి. లేదా సమాధిలో ఉన్నవారిని తమ కోరికలు తీర్చమని అడగడం మరియు వారిని సహాయం కోసం అర్థించడం వంటి షిర్క్ (బహుదైవారాధన) పనులతో కూడిన సందర్శనలు కూడా నిషిద్ధం.
ఒక ముస్లిము సమాధులను సందర్శించేటప్పుడు ఈ క్రింది ఉద్దేశాలను కలిగి ఉండాలి:
మూడవది: మరణించిన వారి పట్ల గౌరవాన్ని మరియు మర్యాదను పాటించవలసిన అవసరం ఉంది. కాబట్టి సమాధులను సందర్శించేటప్పుడు వాటిపై కూర్చోకుండా లేదా నడవకుండా జాగ్రత్త వహించాలి. దీని తీవ్రతను వివరిస్తూ దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా హెచ్చరించారు: "మీలో ఎవరైనా ఒక నిప్పుకణికపై కూర్చోవడం వల్ల అది అతని బట్టలను కాల్చేసి చర్మానికి తగిలినా (ఆ బాధను భరించడమే) అతనికి మేలు, కానీ ఒక సమాధిపై కూర్చోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు" (ముస్లిం 971).
సమాధుల వద్ద చదవవలసిన దుఆ
సమాధులను సందర్శించినప్పుడు పఠించవలసిన దుఆల గురించి ఇక్కడ ఇవ్వబడినవి: అస్సలాము అలైకుమ్ దార ఖౌమిమ్ ముఅమినీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్ (ముస్లిం 249). అర్థం: "మొమిన్ (విశ్వాసులైన) ప్రజల నివాస ప్రాంతమా! మీపై శాంతి కలుగుగాక. అల్లాహ్ తాలిస్తే మేము కూడా వచ్చి మీతో కలవబోతున్నాము." లేదా: అస్సలాము అలా అహ్లిద్ దియారి మినల్ మూమినీన వల్ ముస్లిమీన్, వ యర్’హముల్లాహుల్ ముస్తఖ్ దిమీన మిన్నా వల్ ముస్తాఖిరీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు బికుమ్ లాహిఖూన్ (ముస్లిం 974). అర్థం: "మొమిన్ (విశ్వాసులు) మరియు ముస్లిములైన ఈ గృహ వాసులపై శాంతి కలుగుగాక. మనలో ముందుగా వెళ్లిపోయిన వారిపై మరియు తరువాత వెళ్లేవారిపై అల్లాహ్ కరుణించుగాక. ఇన్ షా అల్లాహ్ మేము కూడా వచ్చి మీతో కలవబోతున్నాము." లేదా: అస్సలాము అలైకుం అహ్లద్ దియారి మినల్ మొమినీన వల్ ముస్లిమీన్, వ ఇన్నా ఇన్ షా అల్లాహు లలాహిఖూన్, అస్అలుల్లాహ లనా వ లకుముల్ ఆఫియా (ముస్లిం 975). దీని అర్థం: "మొమిన్ (విశ్వాసులు) మరియు ముస్లిములైన ఈ గృహ వాసులపై శాంతి కలుగుగాక. ఇన్ షా అల్లాహ్ మేము తప్పకుండా వచ్చి మీతో కలవబోతున్నాము. మా కోసం మరియు మీ కోసం అల్లాహ్ నుండి క్షేమాన్ని కోరుతున్నాను."