నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం నమాజులో అణకువ (ఖుషూ)

మనస్సును లగ్నం చేసి పూర్తి అణకువతో నమాజు చేయడం అనేది నమాజుకు ఆత్మ వంటిది, ఈ పాఠములో అణకువ యొక్క అర్ధం మరియు దానికోసం అవలంబించవలసిన ప్రత్యేక అంశాల గురించి తెలుసుకుందాము

  • నమాజులో అణకువ గురించిన అవగాహన
  • నమాజులో అణకువకు తోడ్బాతునిచ్చే విషయాల గురించిన అవగాహన

నమాజులో అణకువ (ఖుషూ)

నమాజులో అణకువ(ఖుషూ) అనేది దానికి ప్రాణం వంటిది, ఖుషూ అంటే అల్లాహ్ ముందర చేసే ఈ నమాజులో మనస్సును దానివైపు లగ్నం చేయడం, పూర్తి వినయముతో నమాజులోని ఆయతులను, దుఆలను, స్మరణలను అనుభూతి చెందుతూ చదవడం మరియు వినడం చేయాలి.

అణకువ, ఏకాగ్రత మరియు వినమ్రతలతో చేసే ఆరాధన అత్యుత్తమమైన ఆరాధన, ఇది విధేయత యొక్క ఉన్నతమైన రూపము, ఈ కారణంగానే అల్లాహ్ తన దివ్యవచనములో విశ్వాసుల గుణాల గురించి ప్రస్తావించేటపుడు ఇలా సెలవిచ్చాడు : "నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు, వారు ఎలాంటి వారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు. (మూమినూన్ : 1-2)

ఖుషూ(వినమ్రత)తో నమాజు చేసే వ్యక్తి ఆరాధన మరియు విశ్వాసం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తాడు. ఈ కారణంగానే దైవప్రవక్త(స) ఇలా ప్రబోదించారు: "నా కనులకు ప్రార్థనలోనే ఆనందం, చల్లదనం ప్రాప్తిస్తుంది" (నసాయి : 3940). 'కనులకు ఆనందం' అనగా అత్యంత సంతోషము, ఆనందము, సాంత్వనము మరియు సంతృప్తి అని అర్థం.

నమాజులో ఏకాగ్రత మరియు మనస్సును లగ్నం చేయగలిగే మార్గాలు

1. నమాజు కోసం సంసిద్ధమవడం

.పురుషులు ముందుగానే మస్జిదుకు వెళ్ళడం మరియు ఫరద్ నమాజుకు ముందు చదవవలసిన సున్నత్ నమాజులను ఆచరించడం, నమాజుకు వెళ్ళేటపుడు తగిన మంచి దుస్తులను ధరించడం, ప్రశాంతతతో, వినమ్రతతో మస్జిదుకు నడిచి వెళ్ళడం.

ఏకాగ్రతను భంగం చేసే అరియు ఇబ్బందికర అంశాల నుండి దూరంగా ఉండడం

నమాజు చేసే సమయంలో మన ముందు ఏమైనా చిత్రాలు లేదా దృశ్యాల కారణంగా దృష్టి మరలకుండా ఉండాలి. అలాగే శబ్దాలతో మనసు చెదరకుండా ఉండాలి. టాయిలెట్ వెళ్ళాల్సిన అవసరం ఉన్నప్పుడు, లేదా ఆకలితో, దాహంతో ఉండి ఆహారం మరియు పానీయం అందుబాటులో ఉన్నప్పుడు నమాజు ప్రారంభించకూడదు. ఈ నియమాలు నమాజు చేసే వ్యక్తి యొక్క ఏకాగ్రతను పెంపొందించడానికి మనసు ప్రశాంతతతో, స్పష్టతతో ఒక మహోన్నతమైన అంశం వైపు, అనగా తన నమాజు మరియు ప్రభువుతో సంభాషణపై దృష్టి పెట్టేలా చేస్తాయి.

నమాజులో ప్రశాంతత

దైవప్రవక్త(స) వారు ఏకాగ్రతతో రుకూ మరియు సజ్దాలలో ప్రతి ఎముక తన స్థానానికి వచ్చే వరకు ప్రశాంతంగా ఉండేవారు. నమాజులో సరైనవిధంగా, ప్రశాంతంగా ప్రవర్తించని వారికి నమాజులోని అన్ని చర్యలలో ప్రశాంతత కనబరచాలని ఆదేశించారు. తొందరపడటాన్ని నిషేధించారు, ఇటువంటి తొందరబాటును కాకి తన ముక్కుతో పొడవడంతో పోల్చారు.

దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు: “ దొంగతనానికి సంబందించి జనులలో కెల్లా అత్యంత చెడ్డవాడు తన నమాజును దొంగిలించేవాడు.” దానికి సహాబాలు ఇలా ప్రశ్నించారు : ఓ దైవ ప్రవక్తా ! ఒక వ్యక్తి తన నమాజును ఎలా దొంగిలించగలడు, దానికి ప్రవక్త(స) వారు ఇలా జవాబిచ్చారు : “తన రుకూ మరియు సజ్డాలను సంపూర్తిగా చేయని వాడు”. (అహ్మద్ 22642). ఆరాధనను ప్రశాంతముగా చేయనివాడికి అతడి ఆరాధనలో అణకువ, వినమ్రత అనేది అసంభవం, వేగం కారణంగా వినమ్రత అనేది పోతుంది, కాకి ముక్కుతో పొడవడం వంటి నమాజు అనేది సద్ఫలితాన్ని దూరం చేస్తుంది.

4. మనం ఎవరి ముందు నిలబడి ఉన్నామో దాని గొప్పదనం గురించిన ఎరుక మనకు ఉండాలి

ఒక ముస్లిము నమాజులో ఉన్నప్పుడు, తన సృష్టికర్త యొక్క గొప్పతనం మరియు వైభవాన్ని స్మరించుకుంటాడు. తన స్వంత బలహీనతలను, పరిమితులను గుర్తుచేసుకుంటాడు, తాను తన ప్రభువు ముందు నిలబడి ఉన్నానని, వినయంతో, అణకువతో ఆయనతో గుసగుసలాడుతూ మాట్లాడుతున్నానని గుర్తుచేసుకుంటాడు. స్వర్గంలో విశ్వాసులకోసం అల్లాహ్ సిద్ధం చేసిన సద్ఫలితాన్ని మరియు నరకంలో అల్లాహ్ కు సాటి కల్పించే వారికి సిద్ధం చేసిన శిక్షలను కూడా అతను గుర్తుచేసుకుంటాడు. చివరగా, తీర్పుదినాన అల్లాహ్ ముందు తను నుంచుని ఉండే స్థితిని అతడు ఊహించుకుంటాడు.

ఒక వ్యక్తి నమాజు చేసేటపుడు అతని ఏకాగ్రత, అణకువ మరియు వినమ్రతలను బట్టి అల్లాహ్ అతడి మాటలను ఆలకిస్తాడని, అతనికి అనుగ్రహిస్తాడని మరియు అతడికి మాటలకు సమాధానం ఇస్తాడనే తలంపుతో నమాజు ఆచరించాలి. ఈ విధంగా ఆచరించే వ్యక్తి అల్లాహ్ స్తుతించిన ఆ వ్యక్తులకు సమీపంలో ఉన్నాడని చెప్పవచ్చు. తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “సహనం మరియు నమాజ్ ద్వారా (అల్లాహ్) సహాయాన్ని అర్ధించండి. నిశ్చయంగా, అది (అల్లాహ్ కు) వినమ్రులైన వారికి తప్ప, ఇతరులకు ఎంతో కష్టతరమైనది. అలాంటి వారు తాము తమ ప్రభువును నిశ్చయంగా, కలుసు కోవలసి ఉందనీ మరియు ఆయన వైపునకే మరలి పోవలసి ఉందనీ నమ్ముతారు. (అల్-బఖర: 45-46).

పఠిస్తున్న ఖురాను వాఖ్యాలను మరియు నమాజులోని దిక్ర్ లను చింతనగా, పరిశీలనాత్మకంగా చదవడం

ఖురాను అనేది దాని గురించి చింతన చేయడానికి అవతరించినది : (ఓ ముహమ్మద్!) మేము ఎంతో శుభవంతమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) నీపై అవతరింప జేశాము. ప్రజలు దీని సూచనలను (ఆయాత్ లను) గురించి యోచించాలని మరియు బుద్ధిమంతులు దీని నుండి హితబోధ గ్రహించాలని. (సాద్ 29)

ఖురాను వాఖ్యాలలో చింతన అనేది ఎలా ప్రాప్తిస్తుంది ?

నమాజులో ఖురాను యొక్క ఆయతులు, స్మరణలు(జిక్ర్‌)లు, దుఆలు చదివేటపుడు వాటి అర్థాన్ని తెలుసుకోవడం ద్వారానే లోతైన ఆలోచన సాధ్యమవుతుంది. అప్పుడే తమ పరిస్థితులను, జీవిత సందర్భాలను ఒక వైపున మరియు ఆ ఆయతుల, స్మరణల, దుఆల అర్థాలను మరో వైపున పరిశీలించడం వలన హృదయం నుండి వినయం, వినమ్రత వంటి అంతర్గత భావనలు పుట్టుకొస్తాయి, ఆ ప్రభావం వలన కొన్నిసార్లు కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు. అర్థం తెలియకుండా చదవడం వల్ల ఏ భావనా కలగకుండా బహుశా ఏమీ వినడంలేదు మరియు చూడడం లేదు అన్నట్లుగా ఉంటుంది. తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు ఎవరైతే, తమ ప్రభువు సూచనల హితబోధ చేసినపుడు, వారు దానికి చెవిటివారిగా మరియు గ్రుడ్డివారిగా ఉండిపోరో!” (అల్-ఫుర్కాన్: 73).

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి