నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం తీర్పుదినం పట్ల విశ్వాసము

తీర్పుదినం రోజున అల్లాహ్ జనులను సమాధుల నుండి లేపుతాడు, ఆ తరువాత వారి చేసిన కర్మల గురించి లెక్క తీసుకుంటాడు, తీర్పుదినాన్ని విశ్వసించడం అనేది విశ్వాస మూల స్థంబాలలో ఒకటి, ఈ పాఠంలో మీరు తీర్పుదినానికి సంబందించిన పలు ముఖ్య విషయాల గురించి తెలుసుకుంటారు.

  • తీర్పుదినం అంటే ఏమిటి మరియు దాని ఉనికిలో ఉన్న విజ్ఞత గురించిన అవగాహన
  • కొన్ని ప్రళయదిన సూచనల గురించిన అవగాహన
  • తీర్పుదినం పై విశ్వాసానికి సంబందించిన కొన్ని విషయాల పట్ల అవగాహన

తీర్పుదినం పట్ల విశ్వాసం యొక్క అర్ధం

తీర్పుదినాన అల్లాహ్ జనులను సమాధుల నుండి మరలా లేపిన పిదప వారి కర్మల లెక్కను తీసుకుంటాడని మరియు ఆ తరువాత స్వర్గస్తులు స్వర్గంలోని తమ స్థానాలకు, నరకస్తులు నరకంలోని తమ స్థానాలకు చేరేవరకూ లెక్క తీసుకుంటాడని బలమైన విశ్వాసం కలిగి ఉండడం. తీర్పు దినాన్ని విశ్వసించడం అనేది విశ్వాసపు మూల స్థంబాలలో ఒకటి, ఇది లేకుండా విశ్వాసం అనేది చెల్లుబాటు అవ్వదు. దీనిగురించి తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : కాని వినయ విధేయత (ధర్మనిష్ఠాపరత్వం) అంటే, అల్లాహ్ ను, అంతిమదినాన్ని, దేవదూతలను, ప్రతి దివ్యగ్రంథాన్ని మరియు ప్రవక్తలను హృదయపూర్వకంగా విశ్వసించడం. (అల్ బఖర : 177).

తీర్పు దినం అంటే ఏమిటి ?

అంతిమ దినం : అనేది మానవులు తిరిగి లేపబడి, లెక్కింపు మరియు ప్రతిఫలాన్ని పొందే రోజు. ఈ రోజున మానవులు స్వర్గం లేదా నరకంలో స్థిరపడతారు. దీనికి "యౌముల్ ఆఖిరా"( అంతిమ దినం) అని పేరు, ఎందుకంటే దీని తర్వాత మరో రోజు లేదు కాబట్టి. ఖురాన్ మరియు హదీసుల్లో దీనికి అనేక పేర్లు ఉన్నాయి: యౌముల్ ఖియామా (గొప్ప విషయాలు జరిగే రోజు), అస్సాఅ (సమయం), యౌముల్ ఫస్ల్ (విచారణ యొక్క రోజు), యౌముద్దీన్ (న్యాయం యొక్క రోజు) వగైరా.

ఖురాన్ అంతిమ దినంపై విశ్వాసాన్ని ఎందుకు నొక్కి చెప్పింది?

అంతిమమదినం యొక్క విశ్వాసాన్ని ఎన్నో సందర్భాల్లో ఖురాన్ నొక్కి చెబుతుంది, దాని రాకను అనేక అరబిక్ శైలుల ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తుంది. అల్లాహ్ యొక్క విశ్వాసంతోపాటుగా ఈ అంతిమదినం యొక్క విశ్వాసాన్ని అనేక చోట్ల ముడిపెడుతుంది. దీనికి కారణాలు: అంతిమమదినం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, మనుషులు దాని గురించి మరచిపోకుండా ఉండేలా చూడటం, అంతిమమదినం కోసం విశ్వాసం మరియు సదాచారణల ద్వారా సిద్ధం కావడానికి ప్రోత్సహించడం.

.అంతిమ దినం పై విశ్వాసం అనేది అల్లాహ్ పై విశ్వాసం మరియు అతని న్యాయం యొక్క అనివార్య పరిణామం.

అల్లాహ్ ఎప్పుడూ అన్యాయాన్ని అంగీకరించడు . అతను దుర్మార్గులను శిక్షించకుండా, బాధితులకు న్యాయం చేయకుండా ఉండడు. అతను మంచి పనులు చేసిన వారిని సద్ఫలితం ఇవ్వకుండా ఉండడు. అతను ప్రతి ఒక్కరికి వారి హక్కును ఇస్తాడు. ఈ లోకంలో, కొందరు దుర్మార్గులుగా జీవిస్తూ, శిక్షించబడకుండా చనిపోతారు. మరికొందరు బాధితులుగా జీవిస్తూ, న్యాయం పొందకుండా చనిపోతారు. ‘అల్లాహ్ అన్యాయాన్ని అంగీకరించడు’ అనే మాటకు అర్ధం ఏమిటి మరి ?. దీనికి సమాధానం ఏమిటంటే, ఈ జీవితానికి తరువాత మరొక జీవితం ఉండాలి. అక్కడ మంచి పనులు చేసిన వారికి ఫలం దక్కుతుంది, చెడు పనులు చేసిన వారికి శిక్ష పడుతుంది. ప్రతి ఒక్కరికి వారి హక్కు అక్కడే లభిస్తుంది.

ప్రళయదినం యొక్క సూచనలు

ప్రళయదినం మరియు దాని సూచనలను విశ్వసించడం అనేది విశ్వాసములో భాగము, ప్రళయదినానికి ముందు జరిగే ఈ సంఘటనలు ప్రళయదినం దగ్గరగా ఉందని సూచిస్తాయి. ఈ ప్రళయదిన సంకేతాలు మరియు సూచనలు రెండు రకాలుగా విభజింపబడ్డాయి.

1. చిన్న సూచనలు

విబిన్న కాలాలలో ఈ ప్రళయదిన సంకేతాలు ఉంటాయి, జిబ్రాయీల్ వారి హదీసులో చెప్పబడినట్లుగా ‘తొడుగుకోవడానికి చెప్పులు మరియు సరైన బట్టల స్తోమత కూడా లేని గొర్రెల కాపారులు ఎత్తైన భవనాలు నిర్మించడంలో పోటీ పడుతుంటారు’. ఆ హదీసులో ప్రళయదినం ఎప్పుడు సంభవిస్తుంది అని ఆడగబడినపుడు దైవప్రవక్త(స) వారు “ప్రశ్నించబడే వానికన్నా ప్రశ్నిస్తున్న వాడికే ఎక్కువ తెలుసు అని జవాబిచ్చారు. అప్పుడు ‘దాని సూచనల గురించి తెలియజేయండి’ అని అడగడం జరుగుతుంది. దానికి “బానిస స్త్రీ తన యజమానురాలను కంటుంది మరియు తొడుగుకోవడానికి చెప్పులు మరియు సరైన బట్టల స్తోమత కూడా లేని గొర్రెల కాపారులు ఎత్తైన భవనాలు నిర్మించడంలో పోటీ పడుతుంటారు”. అని సెలవిచ్చారు. (ముస్లిం 8)

2. పెద్ద సూచనలు

ప్రళయదినం రాక సమీపిస్తుండగా సంభవించే అతి పెద్ద సూచనలు, ఇవి మొత్తం పది సూచనలు ఉన్నాయి. దీని గురించి హదీసులో ప్రస్తావించబడినది. హుజైఫా బిన్ ఉసైద్ వారి ఉల్లేఖనం : మేము చర్చించుకుంటుంటగా మా వద్దకు దైవప్రవక్త(స) వారు వచ్చారు, ఏమి మాట్లాడుకుంటున్నారని అడిగారు. దానికి మేము ప్రళయదినం గురించి చర్చించుకుంటున్నామని అన్నాము. దానికి వారు(స) ఇలా సెలవిచ్చారు : ఈ పది అతిపెద్ద సూచనలు కానవచ్చేంతవరకు ప్రళయదినం అనేది సంభవించదు : పొగ, దజ్జాల్ రాకడ, ‘జంతువు’ అగుబడడము, సూర్యుడు పశ్చిమాన ఉదయించడము, మరియం కుమారుడు ఏసు దిగిరావము, యాజూజ్ మరియు మాజూజ్ అగుబడడము, మూడు భూకంపాలు (తూర్పు, పశ్చిమ, అరేబియా ద్వీపకల్పంలో), యెమెన్ నుండి ఒక అగ్ని బయలుదేరి ప్రజలను ఒక చోట జమ అయ్యే స్థలానికి వారిని నడిపించడం. (ముస్లిం 2901).

తీర్పుదినం అనే అంశంలో ఇంకా ఏమేమి విషయాలు వస్తాయి ?

అంతిమదినం పై విశ్వాసం అనేది అనేక విషయాలను కలిగి ఉన్నది. వాటిలో

1. పునరుత్థానం మరియు అందరినీ జమ చేయడం పై విశ్వాసం

.చనిపోయిన వారిని వారి సమాధుల నుండి తిరిగి లేపడం, వారి ఆత్మలను వారి శరీరాలకు తిరిగి పంపడం ద్వారా పునరుత్థానం జరుగుతుంది. సర్వలోకాల ప్రభువు సమక్షం నిలబడేందుకు జనులు లేచి, ఒకే ప్రదేశంలో, నగ్నంగా, మొదట సృష్టించబడిన విధంగా సమావేశమవుతారు. ఖురాను, హదీసు, సరైన స్వభావం మరియు బుద్ధి (తర్కం) ద్వారా పునరుత్థానం యొక్క నమ్మకం స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి, సమాధులలో ఉన్నవారిని అల్లాహ్ తిరిగి లేపుతాడని, ఆత్మలు శరీరాలకు తిరిగి పంపబడతాయని, జనులు సర్వలోకాల ప్రభువు కోసం మరలా లేస్తారని మేము విశ్వసిస్తున్నాము.

తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : "ఆ తరువాత మీరు నిశ్చయంగా, మరణిస్తారు". (మూమినూన్ : 15,16 ) వదూ మరియు శుద్ధత అనేది ఉత్తమమైన సద్కార్యాలలో ఒకటి, ఈ పాఠములో మీరు వదూ యొక్క ప్రాముఖ్యత మరియు దాని విధానం గురించి తెలుసుకుంటారు. మరో చోట ఇలా సెలవిచ్చాడు : "ఏమీ? వాస్తవానికి మేము మిమ్మల్ని వృథాగానే పుట్టించామని మరియు మీరు మా వైపునకు ఎన్నడూ మరలి రారని భావించారా?" (మూమినూన్ : 115)

2. కర్మల యొక్క లెక్క మరియు వాటిని తూయడం పై విశ్వాసం

సర్వలోకాల ప్రభువు తన సృష్టిని ఈ లోకంలో వారు చేసిన ఆచరణల ఆధారంగా లెక్క తీసుకుంటాడు. ఏకదైవోపాసకులు మరియు అల్లాహ్, ఆయన ప్రవక్త(స)కు విధేయులు అయినవారికి లెక్క సులభంగా ఉంటుంది, వారి చెడు పనులు క్షమించబడతాయి. వారు స్వర్గానికి ప్రవేశించడానికి అనుమతించబడతారు, అక్కడ వారు శాశ్వత ఆనందాన్ని అనుభవిస్తారు. బహుదైవారాధకులు, పాపాలు చేసినవారికి లెక్క కష్టతరంగా ఉంటుంది. వారు నరకానికి పంపబడతారు, అక్కడ వారు శాశ్వత శిక్షను అనుభవిస్తారు.

మంచి చేడులు ఒక భారీ త్రాసులో తూయబడతాయి. ఒక వైపు మంచి ఆచరణలు, మరోవైపు చెడు ఆచరణలు ఉంటాయి. మంచి ఆచరణలు చెడు ఆచరణలకన్నా ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి స్వర్గానికి వెళ్తాడు. చెడు ఆచరణలు మంచి ఆచరణలకన్నా ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు. నీ ప్రభువు ఎవరినీ అన్యాయం చేయడు. “మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు!” (అల్-అన్బియా: 47)

3. స్వర్గ నరకాలు

స్వర్గం అనేది శాశ్వతమైన ఆనందం యొక్క నివాసం. అల్లాహ్ మరియు ఆయన ప్రవకత(స) పట్ల విశ్వాసం కలిగి ఉండి వారి పట్ల విధేయత, భయభక్తులు, మరియు సజ్జనత కలిగి ఉండే ధర్మవంతుల కోసం అల్లాహ్ దీనిని సిద్ధం చేశాడు. స్వర్గంలో, మానవ మనస్సు కోరుకునే అన్ని రకాల శాశ్వతమైన ఆనందాలు ఉన్నాయి. స్వర్గం యొక్క వెడల్పు ఆకాశం మరియు భూమి యొక్క వెడల్పుతో సమానం అని అల్లాహ్ తన దాసులకు సద్కార్యాలు చేయడానికి మరియు స్వర్గంలో ప్రవేశించడానికి ప్రోత్సహిస్తూ సెలవిచ్చాడు. “మరియు మీ ప్రభువు క్షమాభిక్ష కొరకు మరియు స్వర్గవాసం కొరకు ఒకరితో నొకరు పోటీ పడండి; అది భూమ్యాకాశాలంత విశాలమైనది; అది దైవభీతి గలవారికై సిద్ధపరచపడింది.” (అల్ ఇమ్రాన్: 133).

నరకం అనేది శాశ్వతమైన శిక్ష యొక్క నిలయం. అల్లాహ్ దేనిని అవిశ్వాసుల కోసం, అతని ఆజ్ఞలను అతిక్రమించిన అధర్ముల కోసం దీనిని సిద్ధం చేసి ఉన్నాడు. నరకంలో ఊహించలేని శిక్షలు, బాధలు, మరియు హింసలు ఉన్నాయి. అవిశ్వాసుల కోసం సిద్ధం చేయబడిన నరకాగ్ని నుండి హెచ్చరిస్తూ తన దాసులకు అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మానవులు మరియు రాళ్ళు ఇంధనమయ్యే ఆ నరకాగ్నికి భయపడండి. అది సత్యతిరస్కారుల కొరకే తయారు చేయబడింది”. (అల్-బఖరా: 24).

ఓ అల్లాహ్! మేము స్వర్గాన్ని మరియు దానికి దగ్గర చేసే ఆచరణాలను మరియు మాటలను నీ నుండి కోరుతున్నాము. మేము నరకం నుండి మరియు దానికి దగ్గర చేసే ఆచరణలు మరియు మాటలు నుండి నీ ఆశ్రయం కోరుతున్నాము.

సమాధి శిక్ష మరియు దాని సుఖము

మరణం అనేది ఒక యదార్ధం అని మేము విశ్వసిస్తాము. తనదివ్యవచంములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “వారితో ఇలా అను: "మీపై నియమించబడిన మృత్యుదూత మీ ప్రాణం తీస్తాడు. ఆ తరువాత మీరు మీ ప్రభువు వద్దకు మరలింపబడతారు." (అల్-సజ్దా: 11). అది తప్పనిసరిగా జరిగే ఒక సంఘటన. ఎవరైనా చనిపోయినా, చంపబడినా, ఏ కారణం చేత చనిపోయినా, వారికి రాసి ఉన్న ఆయుష్షు అంతే, అంతకంటే ఒక్క క్షణం కూడా తగ్గించబడలేదు. “మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినపుడు, వారు ఒక ఘడియ వెనుక గానీ మరియు ముందు గానీ కాలేరు”. (అల్-అరాఫ్: 34). చనిపోయిన వారికి వారికి వ్యక్తిగతంగా వారి ప్రళయదినం వచ్చినట్లే, పరలోకపు అంతిమదినం వైపుకు వారు మరలింపబడతారు.

అవిశ్వాసులు మరియు అవిధేయులకు సమాధిలో శిక్ష ఉంటుంది మరియు విశ్వాసులకు మరియు సజ్జనులు సమాధిలో దైవానుగ్రహంలో ఉంటారని మనకు పలు ఖురాను యొక్క ఆయతులు మరియు హదీసులతో తెలుస్తోంది, దీనిని మనం విశ్వసిస్తాము. కానీ దాని స్వభావం గురించి ఊహాగానాలు చేయము. ఎందుకంటే స్వర్గం, నరకం లాగానే, సమాధిలో జరిగే విషయాలు మనకు కనిపించని లోకానికి చెందినవి. మన భౌతిక ప్రపంచంలో మనం చూసిన దానితో పోల్చిచూడగలిగే విషయాల గురించి మాత్రమే మనకున్న బుద్ధి మరియు ఊహాగానాలు పనిచేస్తాయి.

సమాధిలోని స్థితి అనేది ఎలా ఉంటుందో మన ఇంద్రియాలకు అందని, దాగి ఉండే ఒక అగోచర విషయం. ఒకవేళ మన ఇంద్రియాల ద్వారా దానిని గ్రహించగలిగితే, అగోచరం(గైబ్) పై విశ్వాసం అనే దానికి అర్ధం మరియు ప్రయోజనం లేకుండా పోతుంది మరియు బాధ్యత అనే విషయమే ఉండేది కాదు, మరియు జనాలు చనిపోయిన వారిని సమాధిలో పాతిపెట్టేవారే కాదు. దైవప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు : మీరు సమాధిలో ఖననం చేయడం మానేస్తారు -అనే భయం లేకుంటే- నేను సమాధి యొక్క శిక్షను మీకు వినిపించాలని నేను అల్లాహ్ తో దుఆ చేసేవాడిని. (ముస్లిం 2868, నసాయి 2058).

పునరుర్ధానం గురించిన ఖురాను యొక్క ఆధారాలు :

పునరుర్ధానం, అనగా మరణాంతరం మరలా లేపబడడం గురించి ఖురానులు మిక్కిలి వాఖ్యాలు, ఆధారాలు ఉన్నాయి, వీటిలో :

మానవులను అల్లాహ్ మొదటిసారి సృష్టించాడు, సృష్టిని ప్రారంభించగలవాడు దానిని తిరిగి సృష్టించడం అనేది అతనికి అసంభవం కాదు. తన వచనంలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : “మరియు ఆయనే సృష్టి ఆరంభించిన వాడు, ఆ తరువాత దానిని తిరిగి ఉనికిలోకి తెచ్చేవాడు”. (అల్-రూమ్: 27). ఎముకలు చిన్న చిన్న ముక్కలుగా ఎండిపోయిన తర్వాత వాటిని తిరిగి బ్రతికించడం సాధ్యం కాదని నమ్మే వారికి సమాధానం ఇవ్వమని ఆదేశిస్తూ ఇలా సెలవిచ్చాడు : “ఇలా అను: "మొదట వాటిని పుట్టించిన ఆయనే, మళ్ళీ వాటిని బ్రతికిస్తాడు. మరియు ఆయనకు, ప్రతి దానిని సృష్టించే జ్ఞానముంది." (యాసిన్: 79).

ఒకప్పుడు భూమి నిర్జీవంగా మారి, ఎండిపోయి, ఒక్క ఆకుపచ్చ చెట్టు కూడా లేని స్థితిలో ఉండేది. ఆ సమయంలో వర్షం కురిసి భూమి పచ్చగా మారి, అందమైన జతలతో నిండిన మొక్కలతో నిండిపోయింది. భూమిని చనిపోయిన తర్వాత తిరిగి బ్రతికించగలవాడు చనిపోయిన మానవులను కూడా తిరిగి బ్రతికించగలడు. “మరియు మేము ఆకాశం నుండి శుభదాయకమైన నీటిని కురిపించి దాని ద్వారా తోటలను ఉత్పత్తి చేశాము మరియు ధాన్యాలను పండించాము. మరియు ఎత్తయిన ఖర్జూరపు చెట్లను పెంచి, వాటికి వరుసలలో పండ్ల గుత్తులను (పుట్టించాము) మా దాసులకు జీవనోపాధిగా మరియు దానితో (ఆ నీటితో) చచ్చిన భూమికి ప్రాణం పోశాము. ఇదే విధంగా (చనిపోయిన వారిని) కూడా లేపుతాము”. (ఖాఫ్: 9-11).

బుద్ధిమంతుడైన ప్రతి ఒక్కరూ ఒక గొప్ప పనిని చేయగలవాడు చిన్న పనులను కూడా ఖచ్చితంగా చేయగలడని అర్థం చేసుకుంటాడు. అంతేకాకుండా, అల్లాహ్ చాలా గొప్పవాడు, ఆయన సృష్టించిన ఆకాశాలు, భూమి, గ్రహాలు చాలా విశాలమైనవి, అద్భుతమైనవి. అందువల్ల, చిన్న చిన్న ఎముక ముక్కలను తిరిగి బ్రతికించడం అనేది ఆయనకు చాలా సులభం. “ఏమీ? ఆకాశాలనూ మరియు భూమినీ సృష్టించగలవాడు, వాటి లాంటి వాటిని మరల సృష్టించలేడా? ఎందుకు చేయలేడు! ఆయనే సర్వసృష్టికర్త, సర్వజ్ఞుడు”. (యాసీన్ : 81)

అంతిమదినం పై విశ్వాసం కలిగి ఉండడం యొక్క ప్రతిఫలాలు

మరణానంతర జీవితం పై నమ్మకం ఒక విశ్వాసి యొక్క జీవితంపై చాలా ప్రభావం చూపుతుంది. అది ఒక విశ్వాసిని సరైన మార్గంలో నడపడానికి, క్రమశిక్షణతో ఉండేలా చేయడానికి, మంచి పనులు చేయడానికి, అల్లాహ్ కు దగ్గరగా ఉండేలా చేయడానికి, చెడు లక్షణాలను తన నుండి దూరం చేసుకోవడానికి సహాయపడుతుంది. అందుకే చాలా సందర్భాలలో మరణానంతర జీవితం పై విశ్వాసం మరియు సదాచారణలు అనేవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. “అల్లాహ్ మరియు అంతిమదినాన్ని విశ్వసించేవారు మాత్రమే అల్లాహ్ యొక్క మస్జిదులను నిర్వహిస్తారు” (అల్-తౌబా: 18). “మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమాజ్ లను క్రమబద్ధంగా పాటిస్తారు” (అల్-అనామ్: 92). ‬

2. జీవితం యొక్క తాత్కాలిక ఆనందాలలో మునిగిపోయి, అల్లాహ్ ద్వారా ఉండే అవకాశాలను వృధా చేస్తున్న వారికి ఇది ఒక హెచ్చరిక. ఈ జీవితం చాలా చిన్నది, మరియు మనం అల్లాహ్ కు సామీప్యంగా ఉండేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి. మంచి పనులు చేయడానికి మరియు అల్లాహ్ ఆజ్ఞలను పాటించడానికి మనం ఒకరితో ఒకరు పోటీపడాలి. “నిశ్చయంగా, మేము వారిని ఒక విశిష్ట గుణం కారణంగా ఎన్నుకున్నాము, అది వారి పరలోక చింతన”. (స్వాద్ : 46). ఖురానులో, అల్లాహ్ ప్రవక్తలను వారి మహోన్నత కార్యాలను ప్రశంసించాడు. వారు ఈ ఆచరణలు చేయడానికి వారిని ప్రేరేపించినది అల్లాహ్ పై వారికున్న లోతైన విశ్వాసం మరియు మరణానంతర జీవితం పై వారికున్న స్పష్టమైన అవగాహన మాత్రమే.

కొంతమంది ముస్లిములు అల్లాహ్ మరియు అతని ప్రవక్త యొక్క ఆజ్ఞను పాటించటానికి బద్దకించినపుడు అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ఏమీ? మీరు పరలోకాన్ని వదలి, ఇహలోక జీవితంతోనే తృప్తి పడదలచుకున్నారా? కాని ఇహలోక జీవిత సుఖం పరలోక (జీవిత సుఖాల ముందు) ఎంతో అల్పమైనది!” (అల్-తౌబా: 38). మానవుడు పరలోకంపై విశ్వాసం ఉంచినప్పుడు, ఈ లోకంలోని అన్ని ఆనందాలు పరలోక ఆనందంతో పోల్చలేనంత చిన్నవి అని, పరలోక శిక్షలో ఒక్క క్షణం కూడా ఈ లోకంలోని ఎంతటి కష్టంతోనూ పోల్చలేనంత భయంకరమైనది అని గుర్తిస్తాడు. పరలోక ఆనందంలో ఒక్క క్షణం కూడా ఈ లోకంలోని ఎంతటి ఆనందంతోనూ పోల్చలేనంత అద్భుతమైనది అని కూడా అతను గుర్తిస్తాడు .

హక్కు ఎప్పటికీ వృధా కాదు మరియు ధర్మం అనేది ఎప్పటికీ ఓడిపోదు, ఎవరి నుండి అయినా అన్యాయంగా ఒక రవ్వంత హక్కు కూడా లాక్కొబడితే, పునరుత్థాన దినాన అత్యంత అవసరమైన సమయంలో అది తిరిగి లభిస్తుంది. తన హక్కు ఖచ్చితంగా, ఎంతో కీలకమైన సమయంలో తనకు వస్తుందని తెలిసిన వ్యక్తి ఎలా బాధపడతాడు? తనకు మరియు తన వ్యతిరేకులకు మధ్య తీర్పు చెప్పేవాడు, న్యాయం విషయంలో అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు (అల్లాహ్) అని తెలిసిన వ్యక్తి ఎలా దుఃఖిస్తాడు? ఈ భరోసాతో ఒక మనిషి ఎంత కష్టమైన పరిస్థితులలో ఉన్నా కూడా ఓపికతో, నమ్మకంతో ఉండగలడు.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి