ప్రస్తుత విభాగం : model
పాఠం వీలునామా మరియు వారసత్వం
వసీయా (వీలునామా) అనగా అర్ధం ఏమిటి ?
ఒక వ్యక్తి తను మరణించిన తరువాత ఏమి చేయాలనే విషయం గురించి ఒకరిని కోరడాన్ని వసీయా(వీలునామా) అంటారు, ఉదాహరణకు తన ఆస్తి లోని కొంత భాగాన్ని మసీదు కట్టడానికి ఉపయోగించాలని కోరడం వగైరా.
ఒక విశ్వాసికి తన మరణం తరువాత తన ఆర్ధిక వ్యవహారాలకు సంబందించిన వీలునామా రాసే హక్కు ఉంది, దీని గురించి దైవ ప్రవక్త (స) వారు ఇలా సెలవిస్తున్నారు : ఒక వ్యక్తికి వీలునామా రాయలసిన ఆవశ్యకత ఉన్నప్పుడు ఆ వీలునామా రాయకుండా రెండు రాత్రులు కూడా గడపకూడదు, ఖచ్చితంగా వీలునామా రాసేయాలి. ఇబ్ను ఉమర్ (ర) వారు ఇలా సెలవిస్తున్నారు : ఎప్పుడైతే ప్రవక్త (స) వారి నుండి ఈ విషయం విన్నానో అప్పుడు ఒక రాత్రి గడిచినదో లేదో నా వద్ద నా వీలునామా సిద్ధంగా ఉండింది.
వీలునామా రాసే విషయంలో అల్లాహ్, ఋణం తీర్చే వీలునామాను వారసత్వ సంపద పంపక వీలునామా పై ప్రాధాన్యతనిచ్చాడు. దీని గురించి తన దివ్య గ్రంధములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు : (ఈ పంపకమంతా) మృతుని అప్పులు తీర్చి, అతని వీలునామా పై అమలు జరిపిన తరువాతనే జరగాలి.
వీలునామా యొక్క స్థితులు
వీలునామా విషయంలో ఉండే భిన్నమైన స్థితులు :
1. తప్పనిసరి వీలునామా
ఒక విశ్వాసిపై అప్పులు లేదా ఇతరులకు ఇవ్వవలసిన ఆర్ధికపరమైన హక్కులు ఉండి, దానికి ఎటువంటి ఆధారాలు లేదా పత్రాలు లేనిపక్షంలో ఆ హక్కులు తిరిగి ఇవ్వడానికి వీలునామా రాయడం తప్పనిసరి, ఎందుకంటే అప్పు తీర్చడం అనేది ఒక బాధ్యత, ఈ తప్పనిసరి బాధ్యత అనేది నివారించలేనిది.
2. అభిలషణీయమైన వీలునామా
ఇది ఒక విశ్వాసి తన మరణం తర్వాత తన డబ్బులో కొంత భాగాన్ని కొన్ని స్వచ్ఛంద రంగాలలో విరాళంగా ఇవ్వడం. కొంతమంది పేద బంధువులకు దానధర్మాలు చేయడం మొదలైనవి, మరియు దీనిలో కొన్ని షరతులు నిర్దేశించబడతాయి.
వారసులందరిలో ఒక వారసునికి ప్రత్యేకంగా వీలునామా రాయకూడదు, ఎందుకంటే వారసులలో ప్రతి ఒక్కరి హక్కును అల్లాహ్ ముందునుండే విభజించి ఉన్నాడు, ప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు : “వారసుడి కోసం వీలునామా అనేది లేదు”. (అబూ దావూద్ : 3565, తిర్మిజీ : 2120, ఇబ్ను మాజా: 2713).
వీలునామా అనేది ఎల్లప్పుడూ మూడో వంతు ధనంలోనుండే ఇవ్వాలి, దానికన్నా ఎక్కువ ఇచ్చే అనుమతి లేదు, ప్రవక్త(స) వారి అనుచరులలో ఒకరు మూడింట ఒకవంతు కన్నా ఎక్కువ వీలునామా రాయదలచినపుడు ప్రవక్త (స)వారిని వారించారు. మరియు దీని గురించి ఇలా సెలవిచ్చారు : “మూడోవంతు చాలు, ఆ మూడో వంతు కూడా ఎక్కువే”. (బుఖారీ 2744, ముస్లిం 1628)
వీలునామా రాసే వ్యక్తి ధనవంతుడై ఉండాలి, తన వారసులకు చాలినంత ధనం ఇవ్వగలిగి ఉండాలి, ప్రవక్త(స) వారి అనుచరులైన సాద్ బిన్ అబీ వఖాస్ వారు వీలునామా రాయదలచినపుడు వారిని ప్రవక్త (స) వారు ఇలా ప్రబోదించారు : “నీ వారసులు బీదవారిగా ఉండి జనుల ముందు చేయి చాచడం కన్నా నువు వారిని ధనవంతులుగా వదిలి వెళ్ళడం ఉత్తమం” ( బుఖారీ : 1295, ముస్లిం : 1628 )
3. హర్షణీయం కాని వీలునామా
మరణించే వ్యక్తి తన ఆస్తిని తక్కువగా ఉంచి, వారసులు పేదవారైతే, అది వారసులపై ఇబ్బంది కలిగిస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ (స) వారు సాద్ (ర) వారితో ఇలా సెలవిచ్చారు: "నీ వారసులను ధనవంతులుగా వదిలివెళ్లడం అనేది వారిని బిచ్చగాళ్లుగా వదిలివెళ్లడం కంటే మంచిది." (బుఖారీ 1295, ముస్లిం 1628).
4. నిషిద్దమైన ఆజ్ఞాపన (వీలునామా)
ధర్మం నిషేధించిన పనులను చేయమని వీలునామా రాయడం; ఉదాహరణకు, ఒక వారసుడికి, అతని పెద్ద కొడుకు లేదా అతని భార్యకు, ఇతర వారసుల నుండి డబ్బు ఇవ్వమని వీలునామా రాయడం లేదా అతని సమాధిపై గుమ్మటం నిర్మించమని వీలునామా రాయడం.
ధార్మిక శాస్త్రం ప్రకారం చెల్లుబాటు అయ్యే వీలునామా మొత్తం.
మూడో వంతు ఆస్తిని వీలునామాగా ఇవ్వవచ్చు, దానికంటే ఎక్కువ ఇవ్వడానికి వీల్లేదు. దానికంటే తక్కువ ఇవ్వడం మంచిది. సాద్ బిన్ అబీ వఖ్ఖాస్ (ర) వారు : "ఓ ప్రవక్తా, నా మొత్తం ఆస్తిని దానంగా ఇవ్వడానికి వీలునామా రాయవచ్చా?" అని అడిగినప్పుడు, ప్రవక్త (స) "వద్దు" అన్నారు. అపుడు సాద్(ర) ఇలా అన్నారు, "సగం ఇవ్వవచ్చా?" దైవప్రవక్త(స) వారు "వద్దు" అన్నారు. సాద్(ర) ఇలా అన్నారు, "మూడో వంతు ఇవ్వవచ్చా?" ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు, "మూడో వంతు ఇవ్వవచ్చు, అది చాలా ఎక్కువ. మీ వారసులను ధనవంతులుగా వదిలి వెళ్లడం, వారిని బిచ్చగాళ్లుగా వదిలి వెళ్లడం కంటే మంచిది." (బుఖారీ 2742).
వారసులు లేని వ్యక్తికి మూడింట ఒక వంతు బదులుగా మొత్తం డబ్బును విరాళంగా ఇవ్వడానికి అనుమతి ఉంది.
వీలునామా పై అమలు చేయడం విషయంలో ఉన్న నియమాలు
చనిపోయిన వ్యక్తి యొక్క వీలునామాను అమలు చేయడం తప్పనిసరి. అది అమలు చేయకపోతే, అది చెల్లనిదిగా పరిగణించబడుతుంది. తన దివ్యవచనములో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు: “వీలునామా(వసీయతు గురించి) విన్నతరువాత కూడా ఏ వ్యక్తి అయినా దాన్ని మార్చివేస్తే ఆ పాపమంతా ఆ మార్చిన వానిపైనే పడుతుంది. వాస్తవానికి అల్లాహ్ వినేవాడు, తెలిసినవాడునూ. (అల్ బఖర :181).
ఒక వ్యక్తి మరణించినప్పుడు, అతను తన జీవితంలో సంపాదించిన డబ్బును ఇకపై కలిగి ఉండడు. ఇస్లాం మనకు వారసత్వ విభజనను మరియు ప్రతి వ్యక్తికి తన హక్కును ఇవ్వడాన్ని విధిగావించినది, అది మరణించిన వ్యక్తి యొక్క అప్పులను చెల్లించిన తర్వాత మరియు అతని వీలునామాలను అమలు చేసిన తర్వాత.
వారసుల మధ్య విభేదాలు రాకుండా ఉండటానికి ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త ముహమ్మద్ (స) వారి సున్నత్ వారసత్వాలను ఎలా విభజించాలో మనకు వివరించాయి. వారసత్వం విషయంలో అల్లాహ్ అత్యంత న్యాయబద్దమైన న్యాయమూర్తి, కాబట్టి దేశం మరియు ప్రజల ఆచారాలకు విరుద్ధంగా ఉందని చెప్పి ఎవరూ దానిని మార్చడానికి లేదా మార్చడానికి అనుమతించబడరు. అందుకే అల్లాహ్ వారసత్వం గురించిన ఆయత్ తర్వాత ఇలా సెలవిచ్చాడు: “ఇవి అల్లాహ్ నిర్ధారించిన హద్దులు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త(స) వారికి విధేయత చూపేవారికి అల్లాహ్, క్రింద కాలువలు ప్రవహించే(స్వర్గ) వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. వాటిలో వారు కలకాలం ఉంటారు. గొప్ప విజయం అంటే ఇదే”. (నిసా:13).
మరణించిన వ్యక్తి పిల్లలు మరియు బంధువులు తమ బంధువు మరణించిన తర్వాత, వారసత్వ విభజన ఎలా చేయాలో తెలుసుకోవడానికి మరియు ఆర్థిక వివాదాలు మరియు తగాదాలకు దూరంగా ఉండటానికి జ్ఞానం కలిగినవారిని మరియు న్యాయ వ్యవస్థను సంప్రదించాలి.
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.