ప్రస్తుత విభాగం : model
పాఠం అంటు వ్యాధులకు సంబందించిన ఆదేశాలు
వైద్యం చేయించుకోవడం మరియు టీకాలు (వ్యాక్సినేషన్): వ్యాధి సోకకముందే దాని నివారణ కోసం టీకాలు వేయించుకోవడం అనుమతించబడినది. ఇది అల్లాహ్ పై నమ్మకం ఉంచడానికి (తవక్కుల్) విరుద్ధం కాదు. ఎందుకంటే ప్రవక్త (స) ఒక సహీహ్ హదీసులో ఇలా సెలవిచ్చారు: "ఎవరైతే ప్రతిరోజూ ఉదయం ఏడు అజ్వా ఖర్జూరాలను తింటారో, ఆ రోజు అతనికి ఎటువంటి విషం కానీ లేదా మంత్రతంత్రాలు కానీ హాని చేయలేవు." (బుఖారీ: 5445, ముస్లిం: 2047). ఇది ఆపద రాకముందే దానిని నివారించే పద్ధతుల్లో ఒకటి.
ఇస్లామీయ నియమావళి (షరీఅత్) ప్రకారం, అనారోగ్యగ్రస్తులు ఆరోగ్యవంతులతో కలవకుండా ఉండాలని ప్రోత్సహించడం జరిగింది. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: “వ్యాధిగ్రస్తుడైన వ్యక్తిని ఆరోగ్యవంతుడి వద్దకు తీసుకురాకూడదు.” (బుఖారీ: 5771, ముస్లిం: 2221).
అందువల్ల, అంటువ్యాధి సోకిన అనారోగ్యగ్రస్తుడి దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉండాలి. అయితే, అతని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించవచ్చు, అతని క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు, అతని కోసం దుఆ చేయవచ్చు. అంతేకాకుండా, వ్యాధి వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే, అతనికి అవసరమైన మందులు, ఆర్థిక సహాయం లేదా ఇతర రకాల తోడ్పాటును అందించవచ్చు.
ప్లేగు (మహమ్మారి) ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించడం లేదా అక్కడి నుండి బయటకు రావడం నిషిద్ధం. అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (ర)వారు ఉల్లేఖించిన హదీసు దీనికి ఆధారంగా ఉంది. ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు: "ఏదైనా ప్రాంతంలో అది (మహమ్మారి) ఉన్నట్లు మీరు వింటే, అక్కడికి వెళ్ళకండి. ఒకవేళ మీరు ఉన్న ప్రాంతంలోనే అది సంభవిస్తే, దాని నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి బయటకు వెళ్ళకండి." (బుఖారీ: 5729, ముస్లిం: 2219). మెజారిటీ పండితుల అభిప్రాయం ప్రకారం, ఇటువంటి అంటువ్యాధి వ్యాపించిన నగరానికి ప్రయాణించడం లేదా వ్యాధి భయంతో అక్కడి నుండి పారిపోవడం ధర్మసమ్మతం కాదు.
పురుషులకు సామూహిక (జమాఅత్) నమాజు అనివార్యం (వాజిబ్), అయితే ధర్మసమ్మతమైన ఆటంకం (ఉదుర్) ఉన్నప్పుడు దాని నుండి మినహాయింపు ఉంటుందని విద్వాంసులు పేర్కొన్నారు. దీనికి ఆధారంగా ఆయిషా (ర) వారు ఉల్లేఖించిన హదీసును పేర్కొనవచ్చు: దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అనారోగ్యగ్రస్తులైనప్పుడు, ముస్లిములతో కలిసి నమాజు చేయడానికి రాలేకపోయారు. అప్పుడు వారు, "అబూబక్ర్(ర) నమాజు చేయించమని చెప్పండి" అని సెలవిచ్చారు. (బుఖారీ 664, ముస్లిం 418). ఒక ముస్లిము అనారోగ్యం కారణంగా లేదా స్పష్టమైన ఇబ్బంది ఉన్నప్పుడు మసీదులో సామూహిక నమాజుకు వెళ్లకుండా, ఒంటరిగా నమాజు చేసుకోవడం అనుమతించబడినదని దీని ద్వారా తెలుస్తోంది.
ఒక ముస్లిము తన ఇంట్లో ఒక భాగాన్ని నమాజు స్థలంగా (మసీదుగా) ఏర్పాటు చేసుకోవడం అభిలషణీయం. ఏదైనా కారణం చేత వెళ్లలేనప్పుడు విధిగా చేయవలసిన (ఫర్ద్) నమాజులు అక్కడ చేసుకోవడానికి మరియు ఐచ్ఛిక (నఫిల్) నమాజులు ఆచరించడానికి, ఇంట్లోని ఆడవాళ్ళు చదువుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది, ఇది దైవప్రవక్త ముహమ్మద్(స) వారి మార్గం కూడా. ఇత్బాన్ బిన్ మాలిక్(ర) వారు ఉల్లేఖించిన హదీసులో (ముస్లిం), వారు దైవప్రవక్త ముహమ్మద్(స) వారితో తమ కంటిచూపు మందగించిందని, వర్షాలు పడి వాగులు పొంగినప్పుడు తమ ప్రజల మసీదుకు వెళ్లడం సాధ్యపడటం లేదని పేర్కొన్నారు. అందుకే దైవప్రవక్త ముహమ్మద్(స) వారు తమ ఇంటికి విచ్చేసి ఒక చోట నమాజు చేయాలని, తద్వారా ఆ స్థలాన్ని తాము నమాజు చేసుకునే ప్రదేశంగా మార్చుకుంటామని వారు కోరారు. అప్పుడు దైవప్రవక్త ముహమ్మద్(స) వారి ఇంటికి విచ్చేసి అక్కడ రెండు రకాతుల నమాజు చేశారు.
అదే విధంగా మైమూనా(ర) వారు తమ ఇంట్లో నమాజుకై ప్రత్యేక స్థలాన్ని కలిగి ఉండేవారు, మరియు అమ్మార్ బిన్ యాసిర్(ర) కూడా తమ ఇంట్లో ఒక ప్రత్యేక స్థలాన్ని (అరబిక్ లో నమాజు కోసం ప్రత్యేకించిన స్థలాన్ని ముసల్లా ఉంటారు, మసీదు అని కూడా చెప్పవచ్చు) ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి మనం ఇటువంటి క్లిష్ట పరిస్థితుల నుండి పాఠం నేర్చుకోవాలి మరియు మన ఇళ్ళలో నమాజుల కోసం ప్రత్యేక స్థలాలను ఏర్పాటు చేసుకోవాలి.
మసీదులో సామూహిక నమాజు నిర్వహించడం సాధ్యపడనప్పుడు, ఇళ్లలోనే సామూహికంగా (జమాఅత్) నమాజు చేసుకోవడం ధర్మసమ్మతం. దీని ద్వారా సామూహిక నమాజు ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇమామ్ ఆధ్వర్యంలో జరిగే నమాజును అందుకోలేకపోయినప్పుడు లేదా అది తప్పిపోయినప్పుడు, ఇబ్న్ మసూద్ (ర) వారు, అనస్ (ర) వారు మరియు ఇతర సహాబీ (ర) వారు తమ ఇళ్లలోనే సామూహిక నమాజును నిర్వహించినట్లు ఆధారాలు ఉన్నాయి.
ఒకవేళ ఇంట్లో జమాత్ (సామూహిక) నమాజు నిర్వహిస్తే, దానికి ఇమామత్ వహించడానికి మొట్టమొదటి హక్కు ఆ ఇంటి యజమానికే ఉంటుంది. ఒకవేళ ఇంటి యజమాని ముందుకు రాకపోతే, అప్పుడు ఆ సమూహంలో ఎవరికైతే అల్లాహ్ గ్రంథమైన ఖుర్ఆన్ ఎక్కువగా కంఠస్థం ఉందో వారు ఇమామత్ వహించాలి. ఖుర్ఆన్ కంఠస్థంలో అందరూ సమానంగా ఉన్నప్పుడు, నమాజుకు సంబంధించిన నియమ నిబంధనలు (అహ్కామ్) ఎవరికి బాగా తెలుసో వారు ఇమామత్ చేయాలి. ఒకవేళ ఆ విషయంలో కూడా అందరూ సమానంగా ఉంటే, అప్పుడు వారిలో ఎవరైతే వయసులో పెద్దవారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ఒక ముస్లిము తన ఇంట్లో నమాజు చేస్తున్నప్పుడు, అతనితో పాటు నమాజు చేసే వ్యక్తి (ముక్తదీ) ఒక్కడే మగవాడు అయితే, సున్నత్ ప్రకారం అతను ఇమామ్కు కుడి వైపున నిలబడాలి. ఒకవేళ ముక్తదీలు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పురుషులు ఉంటే, వారు ఇమామ్ వెనుక వరుసలో నిలబడటం సున్నత్. ఒకవేళ నమాజు చేసేవారు మహిళ అయితే, ఆమె ఒంటరిగా ఉన్నా సరే ఇమామ్ వెనుక నిలబడటమే సున్నత్. ఒకవేళ పురుషులు మరియు మహిళలు కలిసి నమాజు చేస్తున్నట్లయితే, పురుషులు ఇమామ్ వెనుక నిలబడాలి మరియు మహిళలు పురుషుల వరుసల వెనుక నిలబడాలి.
ఈ విపత్కర పరిస్థితులలో మన కుటుంబ సభ్యులతో నమాజు ఎలా చేయించాలి, దానికి కావలసిన నిబంధనలు ఏమిటి, మరియు శుద్ధత (తహారా) ప్రాముఖ్యతతో పాటు అందులో పాటించవలసిన నియమ నిబంధనల గురించి క్షుణ్ణంగా నేర్పించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ విషయాలపై ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటూ అవగాహన పెంచుకోవాలి.
మహిళలు తమ ఇళ్లలో జమాత్ నమాజు నిర్వహించడం సున్నత్. ఉమ్మె వరాఖ, ఆయిషా మరియు ఉమ్మె సలమా (రజిఅల్లాహు అన్హుమ్) ద్వారా ఈ విషయం నిరూపితమైనది. సామూహికంగా నమాజు చేయడం వల్ల వారికి అల్లాహ్ నుండి గొప్ప ప్రతిఫలం మరియు పుణ్యం లభిస్తుంది. మహిళలు జమాత్ చేసేటప్పుడు, వారికి నాయకత్వం వహించే ఇమామ్ (మహిళ) విడిగా ముందు నిలబడకుండా, మొదటి వరుస మధ్యలో నిలబడాలి.
అంటువ్యాధి సోకిన వ్యక్తి ప్రజల సమూహాలలోకి రావడం నిషిద్ధం. దీనివల్ల ఇతరులకు హాని కలిగే ప్రమాదం ఉంది. అల్లాహ్ ఖుర్ఆన్లో ఇలా సెలవిచ్చారు: "ఎటువంటి తప్పు చేయని విశ్వాసులైన పురుషులను మరియు విశ్వాసులైన స్త్రీలను హింసించే వారు, నిశ్చయంగా ఒక పెద్ద నిందను మరియు స్పష్టమైన పాపాన్ని మూటగట్టుకుంటున్నారు." (అల్-అహ్జాబ్: 58).
ప్రామాణిక ఇస్లామీయ నియమావళి (షరీఅత్) సూత్రాల ప్రకారం: నష్టం కలిగించకూడదు మరియు నష్టపోకూడదు. కావున, ఈ వ్యాధితో బాధపడుతున్న అనారోగ్యగ్రస్తుడు ఆరోగ్యవంతులతో కలవడం నిషిద్ధం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు: "అనారోగ్యగ్రస్తుడిని ఆరోగ్యవంతుడి వద్దకు తీసుకురాకూడదు" (బుఖారి 5771, ముస్లిం 2221).
నమాజు చేసేటప్పుడు ముఖాన్ని కప్పుకోవడం అభిలషణీయం కాదు, ఎందుకంటే దైవప్రవక్త ముహమ్మద్(స) వారు అలా చేయవద్దని వారించారు. అయితే, అవసరమైనప్పుడు లేదా వ్యాప్తి చెందే వ్యాధుల భయం ఉన్నప్పుడు ఇటువంటి మాస్కులను ధరించవచ్చు.
సామూహిక నమాజులు నిలిపివేయబడిన సందర్భంలో కూడా, శుక్రవారానికి సంబంధించిన ఇతర నియమాలు అలాగే వర్తిస్తాయి. కావున ఫజ్ర్ నమాజులో సూరహ్ అస్-సజ్దా మరియు సూరహ్ అల్-ఇన్సాన్ పఠించడం, దుఆలు స్వీకరించబడే సమయమైన అస్ర్ తర్వాత చివరి గడియలో దుఆలు చేయడం, ఆ రోజున దైవప్రవక్త ముహమ్మద్(స) వారిపై అధికంగా దురూద్ పఠించడం మరియు సూరహ్ అల్-కహఫ్ పారాయణం చేయడం ధర్మసమ్మతమే. ఎందుకంటే ఈ నియమాలు స్వతంత్రమైనవి మరియు ఇవి కేవలం సామూహిక నమాజుపైనే ఆధారపడి లేవు.
కరచాలనం చేయడం సున్నత్. దైవప్రవక్త ముహమ్మద్(స) వారు ఇలా సెలవిచ్చారు: "ఇద్దరు ముస్లిములు ఒకరినొకరు కలుసుకుని కరచాలనం చేసుకున్నప్పుడు, వారు విడిపోకముందే అల్లాహ్ వారి పాపాలను క్షమిస్తాడు." (అబూ దావూద్ 5212). అయితే, కరచాలనం ద్వారా వ్యాధి వ్యాపిస్తుందని భయపడినప్పుడు, కేవలం నోటితో సలాం చేయడం సరిపోతుంది. అల్లాహ్ తలిస్తే, దీనికి కూడా వారికి పూర్తి ప్రతిఫలం లభిస్తుందని ఆశించవచ్చు.
اختر مستوى الشرح المناسب لك
يحتوي الدرس الآن على طبقات اختيارية تساعدك على المراجعة السريعة أو التعمق دون مغادرة الدرس.
- الملخص: نظرة سريعة في نحو دقيقة.
- الأساسي: محتوى الدرس الأصلي وهو المسار المعتمد للتقدم.
- المتعمق: تفاصيل إضافية اختيارية عند توفرها.
تقدمك وإكمال الدرس يعتمدان دائما على صفحات المستوى الأساسي.