నేర్చుకుంటూ ఉండండి

మీరు లాగిన్ కాలేదు
మీ పురోగతిని తెలుసుకోవడానికి మరియు పాయింట్లను సేకరించి పోటీల్లోకి ప్రవేశించడానికి ‘త’ వేదికలో ఇప్పుడే నమోదు చేయండి, నమోదు తర్వాత మీరు నేర్చుకున్న అంశాల ఎలక్ట్రానిక్ సర్టిఫికెట్ మీకు లభిస్తుంది.

ప్రస్తుత విభాగం : model

పాఠం ప్రవక్త (స) వారి సున్నతును సంకలనం చేయడం మరియు హదీసులకు సంబందించిన ముఖ్య గ్రంధాలు

హదీసులను నమోదు చేసే విషయంలో ఇస్లామీయ పండితులు అత్యంత ప్రాధాన్యతను, ఆవశ్యకతను కనబరచారు. గొప్ప క్రియాశీలతతో ఈ బృహత్తర కార్యాన్ని చేపట్టారు, హదీసులను కంఠస్తం చేయడంలో, బలమైన మరియు బలహీనమైన హదీసులను వేరు చేయడంలో, ఆ హదీసుల ఉల్లేఖకుల జీవితాల వివరాలను పొంచుపరచంలో ఇలా ఈ అంశానికి చెందిన ఇతర అంశాలలో వారు తమ జీవితలను అర్పించేశారు, వారు చేసిన ఈ బృహత్కార్యాన్ని మనం ఒక సారి గనక మననిస్తే మానవ చరిత్రలో ఇలాంటి మరో ఉదాహరణ మనకు కనపడదు. ఈ పాఠములో మనము హదీసుల నమోదు అంటే ఏమిటి, దానీ దశలు ఏమిటి మరియు ఈ అంశములో సంకలనం చేయబడిన ముఖ్యమైన గ్రంధాలు ఏమిటి అనేవి తెలుసుకుందాము.

  • ప్రవక్త(స) వారి హదీసుల సంకలనంలోని దశల గురించిన జ్ఞానము
  •   ప్రముఖ హదీసు గ్రంథాల  గురించిన అవగాహన
  • ఒక హదీసు ప్రామాణికమైనది (సహీహ్) లేదా బలహీనమైనది (దయీఫ్) అని తెలుసుకునే పద్ధతుల గురించిన  అవగాహన
  

ప్రవక్త (స) వారు హదీసులను గ్రందస్తం చేయడం

దైవప్రవక్త(స)వారి హదీసులను సంకలనం చేయడానికి, వారి(స ) సున్నతులను కాపాడడానికి ఇస్లాం యొక్క పండితులు ఎంతో శ్రద్ధాశక్తులను కనబరచారు. హదీసుల సంకలనంలో, ప్రామాణికత కలిగిన మరియు ప్రామాణికత లేని హదీసులను గుర్తించడంలో తమ జీవితాలను ధారపోసేశారు, ఈ విషయంలో ఒక సారి గనక మనం చరిత్రను నిజాయితీగా తిరగజూస్తే, మానవజాతి చరిత్రలో మనకు ఇటువంటి ఉదాహరణ ఎక్కడా కనిపించదు, ఇదొక అపూర్వ సాధన మరియు ఒక అద్భుతం.

ప్రవక్త (స) వారి హదీసుల సంకలనం (తద్వీన్) అనగా

సున్నతు యొక్క తద్వీన్ అనగా ప్రవక్త(స) వారి ‘ఆదేశాలను, వారి ఆచరణలను మరియు ఆమోదించిన లేదా నిరోధించిన వాటిని సేకరించడం, సంకలనం చేయడం మరియు వాటిని గ్రంధ రూపం ఇవ్వడం.

సున్నత్‌ యొక్క సంకలనం, హదీసులను వ్రాసే ప్రక్రియ ఈ క్రింది విధంగా అనేక దశల గుండా కోనసాగింది:

١
మొదటి దశ : దైవప్రవక్త (స) వారి కాలములో హదీసులను లిఖించడం.
٢
రెండవ దశ : తాబయీన్ ల చివరి కాలములో హదీసుల సంకలనం చేయడం
٣
మూడవ దశ : క్రమ పద్ధతిలో హదీసులను గ్రంధరూపం ఇవడం
٤
నాల్గవ దశ : దీనిలో కేవలం ప్రవక్త (స)వారి హదీసు మాత్రమే ఉండేటట్లు సేకరించడం, వర్గీకరించడం, ఇతర వాటితో మిళితం చేయకుండా క్రమపద్ధతిలో జమచేయబడిన ప్రయాణం.

మొదటి దశ:

హిజ్రీ మొదటి శతాబ్దమయిన ప్రవక్త (స) మరియు సహాబాల కాలములో హదీసులు రాయడం : ఇస్లాం యొక్క ప్రారంభ దశలో ఖురాను మరియు హదీసులు కలగలసిపోకుండా దైవ ప్రవక్త (స) వారు హదీసులను రాయడం నుండి వారించారు,

అబూ సయీద్ అల్ ఖుద్రీ (ర) వారి ఉల్లేఖనం : ప్రవక్త (స) వారు ఇలా సెలవిచ్చారు : నేను చెప్పిన వాటిని రాయవద్దు, నా నుండి ఎవరైనా ఖురాను కాకుండా ఇంకేదైనా రాసి ఉంటే దానిని చరిపేయండి. అయితే నా నుండి హదీసులకు ఇతరులకు తెల్లియజేయవచ్చు పరువాలేదు. ముస్లిం (3004).

పూర్వం ప్రవక్త (స) వారి హదీసులను మదిలో గుర్తుపెట్టుకుని ఉండేవారు, వాటిని అలాగే ఇతరులను నేర్పించేవారు, అయితే ఆ తరువాత దైవ ప్రవక్త (స) కొన్ని హదీసులను వ్రాసే అనుమతినిచ్చారు.

అబ్దుల్లా బిన్ ఉమర్ ఇబ్న్ అల్-అస్ (స) ప్రవక్త ముహమ్మద్ (స) వారి దగ్గర విన్న ప్రతిదాన్ని తను జ్ఞాపకం ఉంచుకోవడానికి వ్రాసుకునేవాడినని నివేదించారు. కొంతమంది ఖురైష్ ప్రజలు, ‘నీవు వినే ప్రతిదాన్ని వ్రాసుకుంటున్నావా? ప్రవక్త (స) కూడా కోపంతోనూ, సంతోషంతోనూ మాట్లాడే ఒక మనిషి. కాబట్టి, అన్నీ వ్రాయనవసరం లేదు’ అని వాదించారు. అప్పుడు నేను వ్రాయడం మానేశాను. తరువాత నేను జరిగిన విషయం ప్రవక్త (స) వారికి చెప్పాను, దానికి వారు తన నోటి వైపు చూపించి, "వ్రాసుకో! ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉన్నదో అతడి సాక్షిగా చెబుతున్నాను, దీని నుండి సత్యమే తప్ప మరేమీ వెలువదడు" అని సెలవిచ్చారు. సునన్ అబి దావుద్ (3646).

వలీద్ బిన్ ముస్లిం యొక్క హదీసులో, ఔజాయి నుండి వర్ణించబడింది, అబూ హురైరా (ర) వారి ఉల్లేఖనం: "అల్లాహ్, ప్రవక్త(స) వారికి మక్కా యొక్క విజయాన్ని ప్రసాదించినపుడు వారు(స) ప్రజల సమక్షంలో నిలబడి అల్లాహ్‌ను స్తుతించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. (అబూ హురైరా(ర) ప్రసంగం గురించి ఇలా సెలవిచ్చారు) యమన్‌కు చెందిన ఒక వ్యక్తి అబూ షాహ్ నిలబడి, 'ఓ దైవప్రవక్తా ! నా కోసం దాన్ని రాసి ఇవ్వండి' అని అడిగాడు. అప్పుడు ప్రవక్త(స) వారు ఇలా సెలవిచ్చారు: 'అబూ షాహ్ కోసం రాసి ఇవ్వండి. వలీద్ ఇలా అన్నారు: 'నేను ఔజాయిని అడిగాను: "ఆయన 'నా కోసం రాసి ఇవ్వండి' అని ఎందుకు అన్నారు? అని. ఆయన ఇలా జవాబిచ్చారు: "ఇది ప్రవక్త(స) నుండి విన్న ప్రసంగ(ఖుత్బా)మే" (బుఖారీ 2434, ముస్లిం 1355).

రెండవ దశ

తాబియీన్ల కాలం చివరిలో (హిజ్రీ రెండవ శతాబ్దం), హదీసులను విస్తృతంగా సేకరించి రాసే పద్ధతి ప్రారంభమైంది. నిర్దిష్ట క్రమ లేకపోయినప్పటికీ, ఇది ప్రవక్త(స) వారి సున్నహ్ ను కాపాడడానికి మరియు వ్యాప్తి చేయడానికి కీలకమైన అడుగు. ఖలీఫా ఉమర్ ఇబ్న్ అబ్దుల్ అజీజ్ ఇద్దరు ఇమామ్‌లను, ఇబ్న్ షిహాబ్ అల్ జుహ్రీ మరియు అబూ బకర్ ఇబ్న్ హజ్మ్‌ను హదీసులను సేకరించమని ఆదేశించారు. ఆయన అన్నిప్రాంతాల వారికి ఈ విధంగా ఆజ్ఞాపత్రం జారీ చేశారు: "ప్రవక్త (స) వారి హదీసులను సేకరించి సంరక్షించండి; ఎందుకంటే నేను జ్ఞానం మాయమై పండితులు దూరమయ్యే ప్రమాదానికి భయపడుతున్నాను."

హదీసులను మొట్టమొదటగా సంకలనం చేయడం ప్రారంభించినది ఇమాం అల్ జహ్రీ (ర) వారు. హదీసుల సంకలనానికి ఇది ప్రారంభముగా ఉండినది.

రెండవ దశ

హదీసులను సంకలనం చేయడంలో రెండు ప్రధాన పద్ధతులు అనుసరించబడ్డాయి : ఒకటి అధ్యాయాల పద్ధతి, ఉదాహరణకు : విశ్వాసం, జ్ఞానం, పరిశుద్ధత, ప్రార్థన వంటి అంశాల ఆధారంగా “అధ్యాయాలుగా” వర్గీకరించబడ్డాయి. రెండవది, “ముస్నద్” విధానం, అనగా ఇందులో ప్రతి సహాబీ చెప్పిన హదీసులు వారి పేరు మీద వేర్వేరు సేకరణలుగా చేర్చబడ్డాయి. ఉదాహరణకు, ముస్నద్ అబూబక్ర్, ముస్నద్ ఓమర్ మొదలైనవి.

ఈ దశలో ఇమాం మాలిక్ బిన్ అనస్ వారు “మువత్త” అనే గ్రంధాన్ని సంకలనం చేశారు : ఈ గ్రంధం ఒక ప్రత్యేక అమరికను కలిగిఉంది, దీనిలో ఇమాం మాలిక్(ర) వారు దైవప్రవక్త (స) వారి హదీసులతో పాటుగా సహాబాలు, తాబయీలు మరియు తబే తాబయీల వాక్యాలు మరియు వారి ఫత్వాలు కూడా జమ చేయడముతో ఈ గ్రంధం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది.

నాలుగవ దశ

హిజ్రీ శకం మూడవ శతాబ్దపు ప్రారంభంలో,దైవ ప్రవక్త (స) వారి హదీసులను వర్గీకరించి, సేకరించి, ఇతర సహాబాలు మరియు తాబయీన్ల మాటలతో కలపకుండా (అవసరమైనపుడు తప్ప) ఖచ్చితత్వానికి, ధ్రువీకరణకు పెద్దపీట వేసి ఒకేచోట చేర్చి గ్రంధ రూపం ఇచ్చే పద్ధతి ప్రారంభమైంది. విఖ్యాత పండితులు ఈ దశలో ప్రముఖ రచనలు చేశారు ఈ సందర్భంగా గ్రంధస్తం చేసిన వారిలో ప్రముఖ ఉదాహరణలు : ఇమామ్ అహ్మద్ వారి ముస్నద్ (ముస్నద్ ఇమామ్ అహ్మద్ ), హుమైదీ వారి ముస్నద్ మొదలైనవి.

మూడవ హిజ్రీ శతాబ్దం మధ్యలో హదీసుల సంకలనం శిఖరాగ్రానికి చేరుకుంది. ఈ కాలంలో ప్రముఖ హదీసు గ్రంథాలు రూపొందించబడ్డాయి: ఇమామ్ బుఖారీ యొక్క 'సహీహ్ బుఖారీ', ఇమామ్ ముస్లిం యొక్క 'సహీహ్ ముస్లిం', అబూ దావూద్, తిర్మిధీ, నసాయీ, ఇబ్న్ మాజా, దారమి వంటి ఇమామ్‌ల ప్రముఖ 'హదీసుల గ్రంథాలు సంకలనం చేయబడ్డాయి.

సున్నత్ యొక్క గ్రంధాలలో ప్రముఖమైనవి

ప్రవక్త (స) సున్నతులకు చెందిన గ్రంధాలన్నిటిలో ఆరు పుస్తకాలు ప్రాచూర్యము చెందాయి , అవి : సహీహ్ అల్ బుఖారీ, సహీహ్ అల్ ముస్లిం, సునన్ అబీ దావూద్, ఇబ్ను మాజా, నసయి మరియు తిర్మిదీ.

సునన్ దార్మి, ముస్నద్ అల్ ఇమామ్ అహ్మద్ మరియు మోతా ఇమాం మాలిక్ కూడా ప్రసిద్ధి చెందిన విధంగా

ఆరు పుస్తకాల యొక్క వివరణ

ఉమ్మత్ ఆమోదించిన అత్యంత ప్రసిద్ధ హదీసు గ్రంధాలలో ఆరు గ్రంధాలు ఉన్నాయి. అవి :

సహీహ్ బుఖారీ (హిజ్రీ శకం 256 లో గతించారు)

ఇది హదీసు యొక్క గ్రంధాలలో ఒకటి. దీని సంకలనకర్త విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు, యుద్ధాలు, ఖురాను వివరణలు, ధార్మిక విశిష్టతల గురించి చేరిన ఆన్ని హదీసులను సంకలనం చేశారు, అయితే హదీసుల ప్రామాణిక విషయంలో మాత్రం పూర్తి నిబబద్దతను కనబరచారు, కఠినంగా వ్యవహరించారు. పవిత్ర ఖురాను తరువాత ఇది అత్యంత ప్రామాణికమైన గ్రంధము.

2. సహీహ్ ముస్లిం (హిజ్రీ శకం 261 లో మరణించారు )

ఈ గ్రంధము కూడా హదీసు యొక్క కీలక గ్రంధాలలో ఒకటి, సంకలన కర్త దీనిలో ప్రామాణిక(స హీహ్) హదీసులు మాత్రమే ఉండేటట్లు జాగ్రత్త వహించారు, అయితే ప్రామాణికత విషయంలో వీరి షరతులు ఇమాం బుఖారీ వారి షరతుల కంటే కుంచెం సరళమైనవి, బుఖారీ గ్రంధం తరువాతి స్థానం వీరి గ్రంధానిదే.

3. సునన్ అబీ దౌద్ (275 హి)

సంకలన కర్తలు ధార్మిక అంశాల ఆధారంగా అధ్యాయాలను రూపొందించబడిన విధానంలోనే ఈ గ్రంధం కూడా సంకలనం చేయబడినది. తన ఈ గ్రంధములో ‘సహీహ్’ మరియు ‘హసన్’ స్థాయి హదీసులను జమ చేశారు, దీనిలో దయీఫ్(బలహీన) హదీసులు చాలా అరుదుగా వచ్చాయి.

4. సునన్ అల్-తిర్మిది (279హి)

ఇది హదీసు గ్రంధాలలో ఒకటి. దీని సంకలనకర్త విశ్వాసాలు, ఆరాధనలు, వ్యవహారాలు, యుద్ధాలు, ఖురాను వివరణలు, ధార్మిక విశిష్టతల వంటివాటిపై దృష్టి సారించారు, అయితే వీటి ప్రామాణికత విషయంలో కఠినంగా వ్యవహరించలేదు, దీని వలన ఇందులో ప్రామాణికమైనవి(సహీహ్), పాక్షికంగా ప్రామాణికమైనవి మరియు ప్రామాణిక లేనివి(దయీఫ్) కూడా ఉన్నాయి.

5. సునన్ అల్-నిసాయ్ (303 హి)

ఇది కూడా ధార్మిక అంశాలను వివరించే అంశాల అధ్యాయాల క్రమముకు చెందినది, ఇందులో సహీహ్, హసన్ మరియు దయీఫ్ వంటి పరిభాషలు ఉన్నాయి.

6. సునన్ ఇబ్న్ మాజా (273 హిజ్రీ )

ఇది కూడా ధార్మిక అంశాలను వివరించే అంశాల అధ్యాయాల క్రమముకు చెందినది, ఇందులో సహీహ్, హసన్, దయీఫ్ మరియు కొన్ని దయీఫ్ అల్ మార్డూడ్ వంటి పరిభాషలు ఉన్నాయి

ఇమామ్ అల్ హాఫీజ్ అబుల్ హజ్జాజ్ అల్ మజ్జి (742 హి) ఇలా సెలవిచ్చారు :

హదీసులను కాపాడడంలో జ్ఞానవంతులైన పండితులను, నేర్పుగల పరిశోధకులను, వివేచనాత్మక విమర్శకులను అల్లాహ్ అనుగ్రహించాడు. వారు హద్దు దాటిపోయేవారి వక్రీకరణలు, అబద్ధాలను కల్పించేవారి కల్పనలు, ఆజ్ఞానుల తప్పుడు అర్థాలను తొలగించి ప్రవక్త(స)వారి సున్నహ్ ను సంరక్షించారు. వారు ఈ హదీసులను కాపాడాలనే తపన, దానిని కోల్పోతామనే భయంతో దాని వర్గీకరణలో, రచనలో విభిన్న పద్ధతులను అవలంబించారు, దీనితో అనేక రకాల రచనలు, వర్గీకరణలు పుట్టాయి. "వాటిలో ఉత్తమమైన వర్గీకరణ, అత్యుత్తమమైన రచన, అత్యంత ఖచ్చితమైనది, అత్యల్ప లోపాలతో కూడుకున్నది, అత్యంత ప్రయోజనకరమైనది, అత్యంత లాభదాయకమైనది, అత్యంత శుభదాయకమైనది, అత్యంత సులభమైనది, అత్యంత ఆమోదయోగ్యమైనది, అనుకూల మరియు వ్యతిరేక అభిప్రాయాలను కలిగిన వ్యక్తులకు, ప్రత్యేకమైన మరియు సాధారణ ప్రజలకు అత్యంత గౌరవనీయమైనది : "సహీహ్ అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్-బుఖారీ", తరువాత "సహీహ్ అబూ అల్-హుస్సేన్ ముస్లిం బిన్ హజ్జాజ్ అన్-నైసాబూరి", వారి తరువాత "అల్-సునన్" అబూ దావూద్ సులైమాన్ బిన్ అల్-అష్అత్ అస్సిజిస్తానీ రచించినది, తరువాత "అల్-జామి'" అబూ ఈసా ముహమ్మద్ బిన్ ఈసా అత్తిర్మిధీ రచించినది, తరువాత "అల్ సునన్" అబూ అబ్దుల్ రహ్మాన్ అహ్మద్ బిన్ షుఐబ్ అన్నసాయీ సంకలనం చేసినది, తరువాత "అల్-సునన్" అబూ అబ్దుల్లాహ్ ముహమ్మద్ బిన్ యజీద్ సంకలనం చేశారు, అదే ఇబ్న్ మాజా అల్-ఖాజ్విని అని పిలువబడింది, అయితే ఇది వారి స్థాయికి చేరుకోలేదు.

ఈ ఆరు పుస్తకాలలోని ప్రతి ఒక్క దానికి ఒక ప్రత్యేకత ఉన్నది, ఈ రంగానికి చెందినవారికి ఈ విషయం గురించి మరింత బాగా ఎరుక, ప్రజలలో ఈ పుస్తకాలు బాగా ప్రసిద్ధిగాంచాయి, ముస్లిం దేశాలలో ఈ గ్రంధాలు బాగా వ్యాప్తి చెందాయి, జ్ఞానార్జన తపన కలిగిన విధ్యార్ధులు ఈ హదీసు గ్రంధాల ద్వారా గొప్ప జ్ఞానాన్ని గడించారు. (తహ్ జీబ్ అల్ కమాల్ [1 / 147].)

సహీహ్ ( ప్రామాణికమైన ) మరియు దయీఫ్(బలహీన) హదీసుల మధ్య తేడాను గుర్తించడం

ఒక ముస్లిము చాలా తేలికగా ఆ రంగంలో నైపుణ్యం కలిగిన ధర్మ పండితుల ద్వారా హదీసు యొక్క ఖచ్చిత స్థాయిని నిర్ధారించుకోవచ్చును, ఆ హదీసు ‘సహీహ్’ (కచ్చితమైనది), ‘మక్బూల్’ (స్వీకృతమైన), ‘దయీఫ్’ (బలహీనమైన) లేదా ‘మర్దూద్’ (తోసిపుచ్చబడే) తరగతికి చెందినది తెలుసుకోవచ్చును, హదీసుల సంగ్రాహకుల గొలుసు (సనద్) మరియు హదీసు యొక్క వచనం (టెక్స్ట్) అనగా పదాలను లోతుగా పరిశీలించి, విశ్వసనీయత ధృవీకరించుకుని స్వీకరించడం లేదా తిరస్కరించడం జరుగుతుంది.

ఈ అంశం పై వ్రాయబడిన, సంకలనం చేయబడిన ప్రామాణికమైన చాలా పుస్తకాలు మరియు ఆన్ లైన్ వేదికలు, అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి ప్రామాణిక హదీసులు మరియు ప్రామాణికం కాని హదీసులను గుర్తించడంలో తోడ్పడతాయి.

హదీథ్‌ల స్థాయిని నిర్ణయించడంలో సహాయపడే అప్లికేషన్‌లు మరియు ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లు

దురర్ అల్-సున్నియ్యా (సున్నతు యొక్క ఆణిముత్యాలు) వెబ్‌సైట్‌లో మీరు హదీత్ ఎన్‌సైక్లోపీడియా చూడవచ్చు, ఇందులో వందల వేల హదీసులు ఉన్నాయి, వాటిపై పూర్వ, ఆధునిక మరియు సమకాలిక పండితుల అభిప్రాయాలతో పాటు ప్రముఖ హదీసుల ధృవీకరణ, విశ్లేషణలు ఉన్నాయి. https://dorar.net లింక్ ద్వారా ఈ వెబ్ సైటును మీరు సందర్శించవచ్చు.

మీరు విజయవంతంగా మీ పాఠాలను పూర్తి చేశారు


పరీక్ష మొదలుపెట్టండి